అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టులు అయితే, జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై మాత్రం కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఈ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. దీంతో ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యాంగపరమైన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది. దిగువ స్థాయి న్యాయమూర్తులకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అధికారం లేదని స్పష్టం చేసింది. అమెరికా చట్టాల ప్రకారం.. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ‘అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే’ అనే ఉద్దేశంతో 1868లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ద్వారా శరణార్థుల పిల్లలకు కూడా అమెరికా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. అమెరికా, కెనడా, మెక్సికోతో సహా 30కి పైగా దేశాలు జన్మతః పౌరసత్వం కల్పిస్తున్నాయి.అయితే, జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల చట్టబద్ధతపై సుప్రీం కోర్టు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై భవిష్యత్తులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ట్రంప్‌ 2.0 పాలన మొదలైన ఐదు నెలల్లో కోర్టుల పాత్ర క్రమంగా క్షీణిస్తుందని తాజా సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ట్రంప్ విధానాలపై కేసులు న్యాయస్థానాల్లో ఉన్నప్పటికీ, వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలన్న న్యాయమూర్తుల అధికారం పై పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు 6–3 తేడాతో తీర్పు ఇచ్చింది. ఈ కేసు Trump Vs CASA అత్యంత వివాదాస్పదమైన ట్రంప్ ఉత్తర్వులలో ఒకదానిపై కొనసాగింది. ఆ ఉత్తర్వు ప్రకారం.. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కు లభిస్తుందున్న అమెరికా రాజ్యాంగ హామీని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులతో రద్దు చేయాలని భావించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని నిపుణుల అభిప్రాయం. ట్రంప్ ఉత్తర్వులను వ్యతిరేకించిన న్యాయమూర్తి జస్టిస్ సోనియా సొటోమయోర్ ‘ఈ తీర్పు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేందుకు ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చినట్లే’ అని వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బాండీ మీడియా ముందు విజయోత్సవం చేసుకున్నారు. ట్రంప్ మాట్లాడుతూ:కొంతమంది వామపక్ష న్యాయమూర్తులు అధ్యక్షుడి అధికారాన్ని తిరస్కరిస్తూ ఒంటెత్తు పొకడలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చారు. ఈ తీర్పు ఆ ప్రమాదాన్ని నివారించింది’ అని వ్యాఖ్యానించారు.