ఒడిశాలోని చోటుచేసుకుని ముగ్గురు భక్తులు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలుయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతులను ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన ప్రభాతి దాస్, బసంతీ సాహూ, ప్రేమకాంత్ మహాంతి (70 ఏళ్లు) గుర్తించారు. ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతా మూర్తుల దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు ఎగబడ్డారు. రథాలు సమీపానికి వచ్చిన వేళ, తోపులాట జరగడంతో కొంతమంది పడిపోయి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భక్తుల నియంత్రణకు పోలీసుల సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వస్తున్నారు.. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ శంకర్ స్వైన్ స్పందించారు. ముగ్గురు చనిపోయారని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపినట్లు ఆయన తెలిపారు. మరణానికి గల కారణం వైద్య పరీక్ష అనంతరం వెల్లడవుతుందని ఆయన పేర్కొన్నారు‘‘రథయాత్రకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. అయితే అనూహ్యంగా భక్తులు నియంత్రణ కోల్పోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది’ అని కలెక్టర్ వివరించారు. అటు, తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘‘ఇది ఒక భయంకరమైన ఘటన. ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే బాధితుల కోసం ప్రార్థించటం. ఈ పవిత్ర ఉత్సవ ప్రతిష్ఠను మసకబార్చిన వారిని ఆ జగన్నాథుడు క్షమించాలి’’ అని పరోక్షంగా బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.ఈ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందిస్తూ.. నేరుగా పట్నాయక్ పేరు ప్రస్తావించకపోయినా, బీజేపీ నాయకులపై రాజకీయ ఆరోపణలు చేశారు. ‘గతంలో బీజేపీడ ప్రభుత్వం కూడా పలు తప్పిదాలు చేసింది. జగన్నాథ స్వామిని అవమానించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 1977 నుంచి రథాలు ఎప్పుడూ రెండో రోజు గుండిచా ఆలయానికి చేరేవి. కానీ ఈసారే ఆలస్యం జరగలేదు’ అని అని కౌంటర్ ఇచ్చారు. పూరీ క్షేత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సూర్యాస్తమయం తర్వాత జగన్నాథుడి రథం కదిలింది. దీనిపై భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.. పూరీలో ఏటా జరిగే రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ పెంచిన తల్లి గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఏడాది రథయాత్రకు 13 లక్షల మంది భక్తులు హాజరైనట్టు అంచనా.