ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నట్లు ఏసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) ప్రకటించింది. మ్యాచ్‌‌లు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? వేదికలు ఎక్కడ? అనే విషయాలు జూలై మొదటి వారంలో ప్రకటించనున్నారు. ఈ తటస్థ వేదికల వైపు ఏసీసీ చూస్తోంది. సాధారణంగా వన్డే ఫార్మాట్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, యూఏఈ మొత్తం ఆరు దేశాల జట్లు పాల్గొననున్నాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి సంబంధాలు సరిగా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్‌కి వెళ్లకపోవడం.. ఆ తర్వాత పహల్గాం ఘటనతో ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు వచ్చాయి. దాంతో తొలుత భారత్ వేదికగా నిర్వహించాలని అనుకున్నా.. ఇప్పుడు వేదిక మార్పుపై ఏసీసీ ఆలోచించింది. శ్రీలంక, భారత్ రెండు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించి.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లు మాత్రం శ్రీలంక వేదికగా ఆడించాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీజన్ మొత్తం యూఏఈ వేదికగా నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ నుంచే 2025 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. 2023లో జరిగిన ఆసియా కప్‌కి కూడా యూఏఈ వేదికైంది. అసలు ఆసియా కప్‌లో టీమిండియా ఆడబోదంటూ అప్పట్లో బీసీసీఐ వర్గాలు చెప్పాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో ఏసీసీ కూడా అలర్ట్ అయింది. ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదంటూ బీసీసీఐ సెక్రటరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీసీ ప్రతినిధులు ఇటు బీసీసీఐ, అటు పీసీబీ పెద్దలతో కూర్చొని మాట్లాడి ఇప్పుడు యూఏఈ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లు నిర్వహిస్తే వచ్చే రెవెన్యూ కారణంగానే ఐసీసీ అయినా, ఏసీసీ అయినా ఆ దేశాలను ఆడించడానికి ప్రయత్నిస్తుంటాయనేది నమ్మలేని నిజం.