ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో విశాఖపట్నం త్వరగా వెళ్లొచ్చు, టోల్ ఫీజ్‌పై కీలక నిర్ణయం

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త నేషనల్ హైవే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు దేవరపల్లి-ఖమ్మం మధ్య హైవే పనులు ముగింపు దశకు వచ్చాయి. తాజాగా ఈ హైవేకు సంబంధించి.. ఎంత దూరం వెళ్తే అంత టోల్ కట్టే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేసి వాహనాలను అనుమతించనున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి ఈ హైవే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తో ద్వారా రెండు గంటల సమయం ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ దేవరపల్లి-ఖమ్మం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో టోల్ వసూలు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వానదారులు ఎంత దూరం ప్రయాణిస్తే.. అంతే టోల్ కట్టాలి. ఈ హైవేలో 11 చోట్ల మాత్రమే ఎంటర్ కావడానికి.. బయటకు ఎగ్జిట్ కావడానికి వీలుంటుంది. అందుకే ఆ 11 చోట్ల టోల్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఏపీలో దేవరపల్లి.. తెలంగాణలోని ఖమ్మం దగ్గర టోల్‌ప్లాజాలు ఉంటాయి. వాహనదారుడు ఎక్కడ ఎంటర్ అయ్యారో టోల్‌ప్లాజా దగ్గర ఫాస్టాగ్‌ ద్వారా తెలుసుకుంటారు. బయటకు వచ్చేటప్పుడు ఎంత దూరం ప్రయాణించారో లెక్కిస్తారు.. ఆ మేరకే టోల్ ఫాస్టాగ్‌ నుంచి కట్ అవుతుంది.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా.. తెలంగాణలోని ఖమ్మం మీదుగా 162.10 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అలాగే ఈ హైవే ఆంధ్రప్రదేశ్‌లో 56.88 కిలోమీటర్లు.. తెలంగాణలో 105.22 కిలోమీటర్లు ఉంది. సంబంధించి ఏపీలో ఉన్న నాలుగో ప్యాకేజీలో 98శాతం, ఐదో ప్యాకేజీలో 84శాతం పనుల్ని పూర్తి చేశారు అధికారులు. తెలంగాణలో మాత్రం 80% పనులు పూర్తయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం దగ్గర ఉన్న మున్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల విషయంలో ఇబ్బందులతో పనుల్లో జాప్యం జరుగుతోంది. అలాగే ఈ హైవేకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం కోర్టులకు చేరడంతో అలా కూడా ఆలస్యమైంది. ఆ భూముల వ్యవహారంలో కూడా కోర్టులో కేసులు ఓ కొలిక్కి రాడంతో మిగిలిన పనుల్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ హైవే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. అంతేకాదు ఈ హైవేలోకి ఆటోలు, ట్రాక్టర్లు, బైక్‌లకు ఎంట్రీ లేదు.. వీరు పాత హైవే మీదుగా వెళ్లొచ్చు. కేవలం లారీలు, బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలకు మాత్రం ఎంట్రీ ఉంటుంది.