అలా వెళ్తే టాటానే.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్..

Wait 5 sec.

అధినేత, సీఎం నారా నాయుడు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తైంది. మరో నాలుగేళ్లు సమయం ఉంది. అయితే అప్పటి వరకూ చంద్రబాబు రిలాక్స్ అవదలుచుకోలేదు. 2029 ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.*ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగోలేని నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. గుడ్ బై చెప్పేస్తామని వార్నింగ్ ఇచ్చారు.* 2029 ఎన్నికలే తన టార్గెట్ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైసీపీ దారుణ రాజకీయాలకు పాల్పడుతోందని.. ప్రజలకు నేతలు వాస్తవాలు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఇక సోషల్‌ మీడియాతో మరింత జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులతో వ్యక్తిత్వ హననం జరుగుతోందని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందన్న చంద్రబాబు.. రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నారు. ఇప్పటి నుంచి నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి పనిచేయాలని.. పనితీరు బాగోలేకుంటే నిర్మొహమాటం లేకుండా పక్కనబెట్టేస్తానని స్పష్టం చేశారు.*వచ్చే ఎన్నికలకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేయాలన్న చంద్రబాబు.. తానా, ఆటా అంటూ విదేశీ పర్యటనలు వద్దని నేతలకు స్పష్టం చేశారు. అలా వెళ్తే వారికి టాటా చెప్పేస్తానని వార్నింగ్ ఇచ్చారు. "నిన్నటి నుంచే మొదలుపెట్టా. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాను. వన్ టూ వన్ మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతి రోజూ ఓ గంట కేటాయిస్తా. ఓ నలుగురితో మాట్లాడుతా. మీరు చెప్పింది వింటా. ఏవైనా ఉంటే నిర్మొహమాటంగా చెప్తా. మిమ్మల్ని గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకుపోదాం. ఎవ్వరి విషయంలోనూ మొహమాటం లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నా." అంటూ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.