తిరుమలలో ప్రైవేట్ హోటళ్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై హోటళ్ల అద్దెలను టీటీడీ తగ్గించింది. అద్దె గడువును కూడా పెంచింది.. కొత్త హోటళ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మూడేళ్లుగా ఉన్న అద్దె గడువును ఐదేళ్లకు పెంచింది.. లో ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్లను కొత్తగా నిర్వహించడానికి టెండర్లు ఆహ్వానించింది. టెండరుదారులకు కొన్ని నిబంధనలు పెట్టింది.. ఈ నెల 23న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ జూలై 19న ముగుస్తుంది. టెండర్ వేసే వ్యక్తి హిందువు అయి ఉండాలి. కనీసం పది హోటళ్లను నడుపుతూ ఉండాలి.. హోటల్ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించారు.హోటళ్ల అద్దెలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వివరాలు.. కౌస్తుభం హోటల్ అద్దెను రూ.16.20 లక్షల నుంచి రూ.12.15 లక్షలకు తగ్గించారు. సప్తగిరి హోటల్ అద్దెను నెలకు రూ.12.99 లక్షల నుంచి రూ.9.75 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్‌కు అద్దెను రూ.5.05 లక్షల నుంచి రూ.3.80 లక్షలకు తగ్గించారు. పీఏసీ(వెస్ట్)కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు.. పీఏసీ(నార్త్‌)కు రూ.4.10 లక్షల నుంచి రూ.3.10 లక్షలకు తగ్గించింది టీటీడీ. హెచ్‌వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు.. ఎస్‌ఎంసీ క్యాంటీన్‌కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్నవాళ్లు టెండర్లు దాఖలు చేయొచ్చు.శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములుతిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. జూన్ 26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించనున్నారు. ఉదయం 07 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. జూలై 01వ తేదీన ఉదయం 11 – 12 గం.ల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 – 6 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ తేదీన స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ అనంతరం, సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం సేవలు రద్దు చేశారు. జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.