India vs Pakistan: దాయాదుల పోరులో గేమ్ ఛేంజర్స్ వీళ్లే!

Wait 5 sec.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం భారత్ మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ విషయమై ఇరుదేశాల మధ్య కాస్తంత నిప్పు రాజేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరింత ఉత్కంఠ రేపనుంది. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణాలు ఫణంగా పెట్టి ఆడుతారు. మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఆఖరి వరకూ ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. లో టార్గెట్ మ్యాచ్‌లు కూడా హై టెన్షన్‌గా సాగేది ఈ రెండు దేశాల మధ్యనే. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హీరో ఆఫ్ ది డే ఎవరవుతారని వేచి చూడాలి. భారత్‌కు కఠిన సవాల్ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే దుబాయ్ పిచ్‌‌లపై పాకిస్తాన్ పేసర్లు రెచ్చిపోయి బౌలింగ్ వేస్తారు. టీమిండియా ఓపెనర్ బ్యాటర్లకు ఇది పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. పేస్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా స్వింగ్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల సామర్థ్యులు. మొదటి పది ఓవర్లు వికెట్ నిలబెట్టుకోగలిగితే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫేవరెట్‌గా కోహ్లిపాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లి బ్యాట్‌కు పనిచెప్పేస్తాడు. ఓడిపోయే మ్యాచ్‌ని కూడా వికెట్ నిలబెట్టి ఆఖర్లు మరిచిపోలేని విక్టరీని అందిస్తాడు. 2021లో మెల్‌బోర్న్ వేదికగా కోహ్లి ఆటతీరును ఎవ్వరూ మరచిపోలేరు. దాంతో పాకిస్తాన్ ప్లేయర్లతో పాటు అభిమానులకు కూడా విరాట్ కోహ్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే విరాట్ కోహ్లి నిజమైన గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్వన్డే వరల్డ్‌ కప్-2023 నుంచి టీమిండియా మిడిలార్డర్ ఎంతో పటిష్టంగా ఉంది. శ్రేయాస్ అయ్యర్-కేఎల్ రాహుల్ వికెట్ పడకుండా భారత్‌కు ఎన్నో విజయాలను అందించారు. వన్డేల్లో మిడిల్ ఓవర్లలో ఏ జట్టు రాణిస్తే ఆ జట్టుకే ఎక్కువగా గెలిచే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ జట్టులోపాకిస్తాన్ జట్టులో భారత్‌పై ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న ఫఖర్ జామన్ గాయం కారణంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. టీమిండియాకు ఇది బాగా కలిసొచ్చే అంశం. ఫఖర్ తర్వాత బాబర్ ఆజామ్, రిజ్వాన్‌లు తమ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ని మలుపుతిప్పేస్తారు. న్యూజిలాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన బాబర్ ఆజామ్, భారత్‌పై కూడా అదే స్థాయిలో రాణించే అవకాశం ఉంది. మహమ్మద్ రిజ్వాన్ క్రీజులో నిలదొక్కుకుంటే సునాయాసంగా సెంచరీ బాదేస్తాడు. టీమిండియా స్పిన్నర్లు రాణిస్తేదూకుడుగా ఆడుతున్న పాకిస్తాన్ మిడిలార్డర్‌పై టీమిండియా ఓ కన్నేయాల్సిందే. ఖుష్డుల్ షా, సల్మాన్ ఆఘా వికెట్ పడకుండా ఆపడమే కాకుండా.. వేగంగా పరుగులు తీస్తూ భారీ స్కోర్ చేసేలా జట్టుకు సాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా స్పిన్ త్రయం మంత్రం వేస్తే తప్పా భారత్‌కు కష్టమే. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా డాట్స్‌తో పాటు వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నవాళ్లు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు.