⍟ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు బడ్జెట్‌⍟ రూ.3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్⍟ బడ్జెట్ ప్రతులకు శ్రీవారి పాదాల వద్ద పూజలు⍟ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్⍟ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర⍟ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు⍟ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ⍟ కూటమి అధికారంలో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రభుత్వం⍟ సూపర్‌-సిక్స్‌ హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం⍟ బడ్జెట్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశంఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తోంది. శాసనసభలోఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌.. శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు.. శాసనమండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రూ.3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, అభివృధ్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అమరావతి, పోలవరంతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయి. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలను ఏప్రిల్, మే నెలలో అమలు చేస్తామని చెబుతోంది. దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్ల పథకానికి కూడా కేటాయింపులు ఉంటాయంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని.. నిధులు కేటాయిస్తారని చెబుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు.. దీనికి సంబంధించి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తారంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తారంటున్నారు.