తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో దర్శనం, ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేస్తోంది. అయితే మే నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే ఈ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. సోమవారం రోజు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఒక్కరోజే 4.8 లక్షలు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టోకెన్లు కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అన్నింటినీ స్వామివారి భక్తులు బుక్ చేసుకున్నారు. టీటీడీ ఖజానాకు దాదాపు రూ.12.24 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని చెబుతున్నారు. అంతేకాదు మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల చేసిన రెండు నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. అంతేకాదు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లను సైతం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.. టీటీడీ రోజుకి 500 చొప్పున 15 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి టిక్కెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు రూ.15.75 కోట్ల ఆదాయం వస్తుంది.తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకంతిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ఘ‌నంగా అభిషేకం నిర్వ‌హిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్క‌డ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సుగంధ‌ ద్రవ్యాలతో క్షేత్ర‌పాల‌కునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.చంద్రప్రభ వాహనంపై శ్రీ క‌ల్యాణ శ్రీ‌నివాసుడి వైభవంశ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహ‌నంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది. వాహ‌న సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.