: పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే పెళ్లిళ్లు ప్రారంభం కాగా.. రానున్న రోజుల్లో భారీగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లి అంటేనే మన భారతీయులు బంగారం, వెండి ఆభరణాలు భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధర కాస్త పెరుగుతోంది. మన సంస్కృతి, సాంప్రదాయాల్లో ఒక భాగం అయిపోయిన బంగారం అనేది ఇప్పుడు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిన వస్తువుగా మారింది. పండగైనా, ఏ శుభకార్యమైనా, పెళ్లి అయినా తప్పకుండా బంగారం ఉండాల్సిందే. నిరుపేదల నుంచి ధనవంతుల వరకు ఎవరికి వారు తమ వద్ద ఉన్న డబ్బుకు అనుగుణంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అందుకే భారత్‌లో ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పసడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. అయితే ఇటీవల కాస్త తగ్గి పసడి ధరలు ఊరట కల్పించగా తాజాగా పెరిగి షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు అంతకుముందు రెండు రోజుల్లో దాదాపు 20 డాలర్లకుపైగా తగ్గగా.. ఇప్పుడు అమాంతం 25 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 2950 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 32.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. మన దేశ కరెన్సీ రూపాయి మారకం విలువ స్థిరంగా రూ.86.683 వద్ద అమ్ముడవుతోంది.హైదరాబాద్‌లో బంగారం ధరలు..హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.80,550 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.87,870కి పెరిగింది.స్థిరంగానే వెండి రేటుహైదరాబాద్ మార్కెట్లో వెండి రేట్లు ఇవాళ రూ.1000 మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది.పైన చెప్పిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలోనివి. అయితే మధ్యాహ్నానికి బంగారం, వెండి రేట్లు మారిపోతుంటాయి. అలాగే జీఎస్టీ వంటి పన్నులు కలిపితే ధరల్లో మార్పు ఉంటుంది. ప్రాంతాలను బట్టి వేరు వేరుగా రేట్లు ఉంటాయి. కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.