సినీ నటి శ్రీరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో షరతులతో ముందస్తు బెయిల్ దక్కింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అయితే చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత లేదని కొట్టేసింది. అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయిరోహిత్‌ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికా అత్యంత అభ్యంతరమైన భాష వాడారన్నారు.. అయితే న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలలోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టడంపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. వివిధ పోలీసు స్టేషన్లలో నమోదు చేసిన ఆరు కేసులలో ముందస్తు బెయిలు కోసం శ్రీరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపగా.. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. శ్రీరెడ్డిపై కర్నూలు టూటౌన్‌, కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌, విజయనగరం జిల్లా నెలిమర్ల రాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవే కావడంతో శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచించింది.