ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ జట్టు పరువు మొత్తం పోయింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్, తమ దేశంలో జరిగ ఈసారి తమ దేశంలో జరిగుగుతున్న ఈ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంటామని టోర్నీకి ముందు బీరాలు పలికింది. కానీ కట్ చేస్తే గ్రూప్ స్టేజ్ నుంచే ఎలిమినేట్ అయిపోయింది. భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్‌ జట్టుపై భారీ విమర్శలు వచ్చాయి. ఆ దేశ అభిమానులయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఇక మాజీ క్రికెటర్ల విమర్శలతో చీల్చి చండాడారు. పాకిస్తాన్ జట్టు కచ్చితంగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్న చాలా డిజప్పాయింట్ అయ్యాడు. ముఖ్యంగా బ్యాటింగ్ తీరుపై డైరెక్ట్‌గా టీవీ షో లైవ్‌లోనే దుమ్మెత్తిపోశాడు. బాబర్ ఆజామ్ జిడ్డు ఆటగాడని.. మ్యాచ్ విజయం సాధించాలంటే ఎలా ఆడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ రోల్ మోడల్ టుక్ టుక్ అంటూ ఎద్దేవా చేశాడు. విరాట్ కోహ్లి రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్ అని.. అందుకే అతని ఆశయాలు కూడా అంతే గొప్పగా ఉంటాయని భారత క్రికెటర్‌‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. సచిన్ వంద సెంచరీలను అధిగమించడమే కోహ్లి టార్గెట్, అందుకే అలా ఆడుతున్నాడని అక్తర్ అన్నాడు. అదే బాబర్ రోల్ మోడల్ టుక్ టుక్ కాబట్టి ఇలా ఆడుతున్నాడని విమర్శించాడు. మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌తో కలిసి ఓ లైవ్ టెలికాస్ట్‌లో షోయబ్ అక్తర్ పాల్గొన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ తీరును విశ్లేషిస్తూ తమ జట్టు ఆటగాళ్లపై విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ జట్టులో అసలు సరైన ప్లేయర్లే లేరన్నాడు. ఫెయిల్యూర్ కెప్టెన్, ఫెయిల్యూర్ సెలక్షన్ అంటూ తన కోపాన్నంత అక్కడే చూపించాడు. భారత్‌కు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు అంటూ మండిపడ్డాడు. అక్తర్‌తో పాటు పాక్ మాజీ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ కూడా పాకిస్తాన్ టీమ్ ఆటతీరును విమర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్, భారత్‌పై ఆడగా రెండింటిలోనూ ఓటమి పాలయింది. న్యూజిలాండ్‌పై ఛేజింగ్ చేయలేక ఓడిపోయిన పాక్.. టీమిండియా వికెట్లు తీయలేక చేతులెత్తేసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇప్పటికే గ్రూప్-ఏలోని పాక్, బంగ్లా జట్లు ఇంటిదారి పట్టగా భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.