ఎయిర్‌టెల్ యూజర్లకు ‌గుడ్‌న్యూస్.. ఇక ఆ ఓటీటీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..!

Wait 5 sec.

OTT: భారతీ ఎయిర్‌టెల్, యాపిల్ కంపెనీలు తాజాగా ఓ డీల్ కుదుర్చుకున్నాయి. దీంతో కస్టమర్లకు ఓటీటీలు ఫ్రీగా వాడుకునే అవకాశం లభించింది. యాపిల్ సంస్థకు చెందిన , వంటి ఓటీటీలను ఎయిర్‌టెల్ యూజర్లు.. ఇక ఉచితంగా ఆస్వాదించవచ్చని ఎయిర్‌టెల్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. రూ.999తో ప్రారంభం అయ్యే రీఛార్జ్ ప్లాన్లపై హోమ్ వైఫై యూజర్లు అందరికీ ఈ యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అంతేకాకుండా రూ.999 నుంచి ప్రారంభం అయ్యే రీఛార్జ్ ప్లాన్లపై పోస్ట్‌పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ ప్లస్ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. వీటితోపాటు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు ఉచితంగా ఆస్వాదించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఇందులో ఇండియన్ మ్యూజిక్‌తోపాటు ఫారిన్ మ్యూజిక్‌ లిస్టింగ్‌ కూడా ఉంటుందని తెలిపారు. ఎయిర్‌టెల్ వినియోగదారులు యాపిల్ టీవీ ప్లస్‌లోని అన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను ఎలాంటి యాడ్స్ లేకుండా వీక్షించే అవకాశం ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఇందులో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్, డిస్‌క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయని పేర్కొంది. అవే కాకుండా వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఎయిర్‌టెల్ యూజర్లకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్‌ కూడా ఉచితంగా లభిస్తుందని తెలిపింది. ఈ యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.రూ.1099, రూ.1599, రూ.3999 ఎయిర్‌టెల్ వైఫై ప్లాన్ల సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారికి 350కి పైగా టీవీ ఛానళ్లుతోపాటు వరుసగా 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఇక ఈ కొత్త ఆఫర్‌తో ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత బలంగా మారిందని సంస్థ తెలిపింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్‌ అందించే ప్రముఖ సంస్థల్లో ఎయిర్‌టెల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.