ఏపీ విద్యాశాఖ మంత్రి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో టీమిండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌‌ను తిలకించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..అయితే మ్యాచ్‌కు ముందు నారా లోకేష్ ఐసీసీ ఛైర్మన్ జైషాతో సమావేశమయ్యారు. ఏపీలో క్రికెట్‌ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై జై షాతో చర్చించినట్లు లోకేష్ ట్వీట్ చేశారు. క్రికెట్‌ క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. మ్యాచ్ తిలకించిన వారిలో.. మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోషియేన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినాని చిన్ని, మరో ఎంపీ సానా సతీష్, డైరెక్టర్ సుకుమార్‌, నారా దేవాన్ష్‌లు గ్రౌండ్‌లో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ ఊర్వశీ రౌతేలాలు ఉన్నారు. పాకిస్థాన్‌పై భారత్‌ విజయం మర్చిపోలేని అనుభూతి అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అభిప్రాయపడ్డారు. తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి దుబాయిలో మ్యాచ్ వీక్షించగా.. ఆ ఫోటోను ట్వీట్ చేశారు. 'ఆటలో ఇది పూర్తి ఆధిపత్యం. అద్భుతమైన టీమ్‌వర్క్‌. విరాట్‌ మళ్లీ గొప్ప ఫామ్‌లో ఉన్నారు. దుబాయి స్టేడియంలో సందడి వాతావరణం కనిపిస్తోంది’ అన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత క్రికెట్‌ జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రశంసించారు.టీమిండియాకు ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. సెంచరీతో విరాట్‌ కోహ్లీ చెలరేగారని ప్రశంసించారు. మరోవైపు నారా లోకేష్ టీమిండియా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, అలాగే టీమిండియా టీ20 టీమ్ ఓపెనర్ అభిషేక్ శర్మలతో గ్రౌండ్‌లో కనిపించారు.ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలోకి దిగిన పాకిస్థాన్‌‌ను టీమిండియా చేతిలో ఓడిపోయింది.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో పాకిస్థాన్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 42.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో వరుసగా రెండు విజయాలు సాధించి.. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ చేరింది!