: దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన జిందాల్ గ్రూప్ అనుబంధ సంస్థ జిందాల్ వరల్డ్ వైడ్ (Jindal Worldwide Ltd) తమ షేర్ హోల్డర్లకు ఇటీవలే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రకటించింది. ఈ వారమే ఎక్స్ బోనస్ ట్రేడింగ్ జరపనుంది. . 1:4 నిష్పత్తిలో బోనస్ షేర్లు అందించేందుకు ఫిబ్రవరి 28, 2025ను రికార్డు తేదీ నిర్ణయించింది. అంటే ఆ రోజు ఎక్స్ బోనస్ ట్రేడ్ చేపడుతుంది. ఫిబ్రవరి 27వ తేదీ మార్కెట్లు ముగిసే సమయానికి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారికి బోనస్ షేర్లు వస్తాయి. 1 షేరు కొంటే మరో 4 షేర్లు ఉచితంగా అందిస్తారు. రికార్డు తేదీ ఫిబ్రవరి 28 నాటికి ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి ప్రతి 1 షేరుకు 4 షేర్లు ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లు ఫ్రీ రిజర్వుల నుంచి కేటాయిస్తోంది కంపెనీ. ఈ తర్వాత వాటాదారుల డీమ్యాట్ ఖాతాల్లో షేర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరగనుంది. 1:4 నిష్పత్తిలో కాబట్టి రికార్డు తేదీ నాటికి 100 షేర్లు కొన్న వారికి 400 షేర్లు ఉచితంగా వస్తాయి. అంటే డీమ్యాట్ ఖాతాలో మొత్తం 500 షేర్లు వచ్చి చేరతాయి. అయితే బోనస్ షేర్ల తర్వాత షేరు ధర తగ్గుతుంది. రికార్డు తేదీ తర్వాత తక్కువ ధరకే ఈ కంపెనీ షేర్లు లభిస్తాయి.జిందాల్ వరల్డ్ వైడ్ షేర్లు ఫిబ్రవరి 24వ తేదీన ట్రేడింగ్ రోజున మధ్యహ్నానం 12 గంటల సమయానికి 5 శాతం లాభంతో రూ.372 పైన ట్రేడవుతోంది. గడిచిన మూడు నెలల్లో ఈ స్టాక్ ధర 15 శాతం మేర పెరిగింది. క్రితం నెల రోజుల్లో షేరు ధర 10 శాతం తగ్గింది. కానీ, గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ స్టాక్ ఏకంగా 540 శాతం మేర లాభాలు ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూ.6.40లక్షల వరకు అందించింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.471.20 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.273.45గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.7470 కోట్లుగా ఉంది. జిందాల్ వరల్డ్ వైడ్ కంపెనీ అహ్మదాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న జిందాల్ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ. ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ ఫాబ్రిక్స్ తయారు చేస్తుంది. డినిమ్ ఫ్యాబ్రిక్‌లో ఆసియాలో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.