కప్పు కొట్టేందుకే వచ్చామన్నారు.. 100 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో చిత్తయ్యారు..!

Wait 5 sec.

ICC : “ఇక్కడికి ఏదో మ్యాచ్‌లు ఆడి వెళ్లడానికి మేం రాలేదు.. కప్ తీసుకెళ్లడానికే వచ్చాం” ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌కు ముందు అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీద్ చేసిన వ్యాఖ్యలివి. 1983లో వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు వెళ్లినప్పుడు భారత కెప్టెన్ కపిల్ దేవ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కానీ దాన్ని నిజం చేసి చూపించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు అఫ్ఘానిస్తాన్ కెప్టెన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. కానీ ప్రదర్శనలో మాత్రం ఆ జట్టు తేలిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ జట్టు 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో తొలి మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ టోర్నీలో అఫ్ఘానిస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌లోల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో తలపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు సెమీస్ చేరడం అటుంచితే.. ఒక్క మ్యాచ్ గెలిచినా.. అద్భుతమే.కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ రికెల్టన్ సెంచరీ చేశాడు. టెంబా బవూమా, వాన్ డర్ డస్సెన్, మార్‌క్రమ్‌లు హాఫ్ సెంచరీలు చేశారు. అప్ఘానిస్థాన్ బౌలర్లలో నమీ 2 వికెట్లు తీశాడు. ఫజల్‌హక్‌ ఫరూఖీ, అజ్మతుల్లా, నూర్ అహ్మద్‌లు ఒక్కో వికెట్ తీశారు.అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అప్ఘానిస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారీ ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు నిరాశపరిచారు. గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (17) త్వరగానే ఔట్ అయ్యారు. అయితే రెహ్మాత్ షా(90) ఒంటరి పోరాటం చేశాడు. అయితే అతడి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు తీశాడు. లుంగీ ఎంగిడి 2, ముల్డర్‌ 2, మార్కో జాన్సన్‌ 1, కేశవ్‌ మహారాజ్‌ 1 వికెట్ తీశారు.