on : తీర్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆయన ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ప్రశ్నించారు. ఈ విషయంపై గోయెంకా X ప్లాట్‌ఫామ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. దీనిపై మాల్యా కూడా స్పందించి.. గోయెంకాకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలోనే మాల్యా కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హర్ష్ గోయెంకా ఏమన్నారు?2025, జూన్ 5న X ప్లాట్‌ఫామ్‌లో (ట్విట్టర్) హర్ష్ గోయెంకా.. " విలాసవంతంగా జీవించారు. అవును. రుణాలు చెల్లించలేదు. అవును. కానీ ఇతరుల్లా కాకుండా, ఆయన రూ. 9,000 కోట్లకు పైగా రుణాలను తీర్చినట్లు సమాచారం. అయితే, ఇంకా పెద్ద డిఫాల్టర్లు బ్యాంకుల నుంచి చాలా పెద్ద మొత్తంలో లోన్లు ఎగవేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఒకవేళ రుణాలు ఇంకా ఉన్నాయని బ్యాంకులు చెప్పాలి. లేకపోతే, మాల్యా ఇంకా రాజకీయ లక్ష్యంగా ఎందుకు మారుతున్నారు? న్యాయం నిష్పక్షపాతంగా ఉండాలి. అందరికీ ఒకేలా ఉండాలి."గోయెంకా పోస్ట్‌కు మాల్యా స్వయంగా స్పందిస్తూ, " థ్యాంక్ యూ హర్ష్. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ధ్రువీకరించింది. బ్యాంకులు నా నుంచి రూ. 14,100 కోట్లు రికవరీ చేశాయి, అది డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) తీర్పు ప్రకారం రూ. 6,203 కోట్ల రుణానికి మించినది. ఈ వివక్ష ఎందుకు?" అని ప్రశ్నించారు.విజయ్ మాల్యా, ఒకప్పుడు 'కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్'గా పేరొందిన వ్యాపారవేత్త, 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఈ విమానయాన సంస్థ లగ్జరీ సేవలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తప్పుడు వ్యాపార వ్యూహాలు, అప్పుల భారం, అవినీతి ఆరోపణలతో 2012 నాటికి మూతపడింది. మాల్యా 17 భారతీయ బ్యాంకుల నుంచి సుమారు రూ. 9,000 కోట్ల రుణాలు తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్నాయి.మాల్యాపై మనీలాండరింగ్, మోసం ఆరోపణలతో సహా అనేక నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, IDBI బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను భారత్‌కు అప్పగించాలని.. భారత ప్రభుత్వం బ్రిటన్‌ను కోరుతోంది. అయితే, మాల్యా తనపై వచ్చిన ఆరోపణలను.. రాజకీయ కారణాలతో కూడినవని, తనకు న్యాయమైన విచారణ జరిగితేనే భారత్‌కు తిరిగి వస్తానని వాదిస్తున్నారు.బ్యాంకు రికవరీ ఎంత?2024 డిసెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించిన వివరాల ప్రకారం, చేశాయి. ఇది మాల్యా రుణం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆయన వాదిస్తున్నారు. అయితే, ఈ రికవరీలు మాల్యా ఆస్తుల బలవంతపు వేలం ద్వారా జరిగాయని, ఆయన స్వచ్ఛందంగా చెల్లించినవి కావని నెటిజన్లు అంటున్నారు.గోయెంకా పోస్ట్‌పై ఎక్స్ వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఒక యూజర్.. మాల్యాపై నేరపూరిత ఆరోపణలను హైలైట్ చేస్తూ, "రుణాలు తిరిగి చెల్లించినంత మాత్రాన నేరపూరిత ఆరోపణల నుంచి బయటపడరు. IDBI నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.'' అని కామెంట్ చేశారు."మాల్యా ఆస్తుల్ని జప్తు చేసి వేలం వేసిన తర్వాతే ఈ రికవరీ సాధ్యమైంది. ఇది ఆయన చెల్లించినట్లు కాదు. మోసపూరిత రుణాలు, న్యాయస్థానాలను ఎదిరించడం, మనీలాండరింగ్ ఆరోపణలు.. ఇవన్నీ మాల్యాను నిర్దోషిగా చేయవు.' అని మరొకరు అన్నారు. ఇంకా కొందరు.. "గోయెంకా వాదనను సమర్థిస్తూ, "మాల్యా రుణాలు తీర్చారు కాబట్టి, ఆయనను స్వేచ్ఛగా జీవించనివ్వాలి. మనం వ్యాపారవేత్తలను నేరస్థులుగా మార్చకూడదు," అని అభిప్రాయపడ్డారు.మాల్యా పాడ్‌కాస్ట్..ఈ చర్చ నడుస్తున్న సమయంలోనే, మాల్యా రాజ్ శమని (Raj Shamani) హోస్ట్ చేసిన ఒక పాడ్‌కాస్ట్‌లో తొలిసారిగా తన వైపు వాదన వివరించారు. 4 గంటల ఈ ఇంటర్వ్యూలో, మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. "నేను రుణాలు తిరిగి చెల్లించే ఉద్దేశంతోనే ఉన్నాను, దొంగతనం చేయలేదు," అని ఆయన స్పష్టం చేశారు. న్యాయమైన విచారణ జరిగితే భారత్‌కు తిరిగి వస్తానని కూడా అన్నారు.