తల్లికి వందనం పథకం వీళ్లకు మాత్రమే.. అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు ఇవేనా, చెక్ చేస్కోండి!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ నెలలోనే తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఏంటి, ఏ డాక్యుమెంట్లు కావాలి వంటి వివరాలతో మార్గదర్శకాలు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మార్గదర్శకాల పేరుతో వైరల్ చేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్ 12న (స్కూల్స్ రీ ఓపెన్ చేసిన రోజు) ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ పథకానికి ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.. ప్రభుత్వం వీరికి ప్రతీ ఏటా రూ.15000 సాయం అందిస్తుంది.ఈ పథకానికి కావలసిన అర్హతలు:-1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి.2. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో చదువుతుండాలి3. ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు,4. విద్యార్థులకు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.5. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.6. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.అవసరమైన డాక్యుమెంట్లు:-1. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్2. తల్లి ఆధార్ కార్డు3. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు4. పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్5. నివాస పత్రము లేదా రేషన్ కార్డ్6. కుల ధ్రువీకరణ పత్రము7. అవసరమైతే ఇన్‌కమ్ సర్టిఫికెట్'ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి , తల్లుల యొక్క ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. తల్లికి వందనం రూ.15,000/- మీ అకౌంట్లో పడాలంటే, విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో పాటు NPCI జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కానీ వారు లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాలలో సంప్రదించండి' అంటూ మార్గదర్శకాలు విడుదలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు మార్గదర్శకాలపై క్లారిటీ ఇవ్వలేదు. పైన తెలిపిన మార్గదర్శకాలు కూడా కామన్‌గా ఉండేవాటిని ప్రస్తావించారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో చేస్తామని హామీ ఇచ్చాయి. వీటిలో ముఖ్యమైన పథకం విద్యార్థులు కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఏటా అర్హులైన విద్యార్థులకు రూ.15000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి.