ఆర్‌బీఐ నుంచి గుడ్‌న్యూస్.. దూసుకెళ్తున్న మార్కెట్లు.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్!

Wait 5 sec.

: దేశీయ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమైనా ఆ తర్వాత దూసుకెళ్లాయి. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్ల సవరణ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్‌బీఐ ప్రకటించిన తర్వాత మార్కెట్లలో కొత్త జోష్ నిపిస్తోంది. బ్యాంక్, ఆటో, రియాల్టీ రంగంలోని కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రికార్డ్ గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో 720 పాయింట్ల లాభంతో 82 వేల 162 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 237 పాయింట్లు లాభపడి 24,988 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 857 పాయింట్లు పెరిగి 56 వేల 618 వద్ద కొనసాగుతోంది. ఇవాళ 1.54 శాతం మేర లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 600 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు.. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. . జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన ఈ సమావేశంలోని నిర్ణయాలను జూన్ 6న శుక్రవారం ప్రకటించారు గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో 6 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెపో రేటు మొత్తంగా 1 శాతం మేర తగ్గింది. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత వంటి రుణాలపై వడ్డీ భారం తగ్గుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం, పసిడి సంబంధిత రంగంలోని షేర్లు రాణిస్తున్నాయి. సీఆర్ఆర్ రేటును తగ్గించడంతో ద్రవ్య లభ్యత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హై రిస్క్ కలిగి ఉంటాయి. సూచీలు పెరుగుతున్నాయి కదా అని గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అన్ని తెలుసుకుని, సరైన సమయంలో, సరైన స్టాక్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేసినప్పుడే లాభాలు అందుకోవచ్చు.