ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్.. నీతి ఆయోగ్ గ్రీన్ సిగ్నల్

Wait 5 sec.

విజయవాడ రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు రానున్నాయి. రాబోయే 30 ఏళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. రూ.850 కోట్లతో పీపీపీ (Public Private Partnership) విధానంలో స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను కేటగిరి-1 కింద అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం రోజుకు 1.14 లక్షల మంది ప్రయాణికులు వస్తున్నారు.. అదే రద్దీ సమయాల్లో గంటకు 9,120 మంది రాకపోకలు ఉంటుంది. 2061 నాటికి ఈ సంఖ్య రోజుకు 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రద్దీ సమయాల్లో ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించనున్నారు.. చూడటానికి లో కనిపించనుంది.ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఝీ 01 జాబితాలో ఉన్న విజయవాడ 12,538 చదరపు మీటర్లలో ఉంది. దీనిని 1.54 లక్షల చదరపు మీటర్లకు పెంచనున్నారు. స్టేషన్ 84 వేల చదరపు మీటర్లలో ఉంటుంది. హోటళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు 70 వేల చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ స్థలం ప్రస్తుతం 426 కార్లకు మాత్రమే ఉంది.. ఇప్పుడు దానిని 1,700 కార్లకు పెంచనున్నారు. లిఫ్టుల సంఖ్య 8 నుంచి 35కి, ఎస్కలేటర్ల సంఖ్య 9 నుంచి 30కి పెరుగుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా విస్తరిస్తారు. ప్లాట్‌ఫాంల సంఖ్య 10 నుంచి 12కి పెరుగుతుంది. ప్రస్తుతం ప్రధాన మార్గం వైపు మాత్రమే అభివృద్ధి అంతా సాగుతుండగా.. కొత్త స్టేషన్‌లో పశ్చిమం వైపు కూడా కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. మరోవైపు రైల్వే అధికారులు విజయవాడ పై ఒత్తిడి తగ్గిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ శివారు ప్రాంతాలకు రైల్వే సేవలు చేరవేసేందుకు ఈ మేరకు గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. గుణదల ఆధునిక హంగులతో శాటిలైట్ స్టేషన్‌గా మారుతోంది. పది నెలలక్రితం ప్రారంభమైన పనులు శరవేగంగా జరుగుతుండగా.. జూన్ నెలాఖరు నాటికి గుణదల శాటిలైట్‌స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు రాయనపాడు రైల్వే స్టేషన్‌‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.