: పరిధిలోకి వచ్చే వారికి బిగ్ అలర్ట్. మీరు ఐటీఆర్ ఫైలింగ్ ఇంకా మొదలు పెట్టలేదా? విభాగం ఇటీవలే గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన రిటర్నులు ఫైల్ చేసేందుకు ఐటీఆర్-1, 4 ఎక్సెల్ యుటిలిటీలను విడుదల చేసింది. అలాగే వాలిడేషన్ టూల్స్, ఆఫ్‌లైన్ యుటిలిటీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన కేవలం 5 రోజుల్లోనే 1.23 లక్షలకుపైగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ముందుగా ఇచ్చిన సమాచారంతో ట్యాక్స్ పేయర్లు ఈజీగా ఆఫ్‌లైన్ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఐటీ రిటర్నుల దాఖలు చాలా జాప్యం తర్వాత ఎట్టకేలకు మొదలైంది. ఏప్రిల్ చివరి వారంలో ఐటీఆర్ ఫామ్స్ విడుదల చేసిన ట్యాక్స్ విభాగం ఆ తర్వాత మరింత సమయం తీసుకుని ఎక్సెల్ యుటిలిటీలు విడుదల చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫామ్స్ గత వారమే అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్కసారిగా ట్యాక్స్ పేయర్లు రిటర్నులు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో ఇప్పటికే 90 శాతానికిపైగా రిటర్నులను ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. దీంతో ఐటీఆర్ ప్రాసెసింగ్, రీఫండ్ జారీపై ట్యాక్స్ పేయర్ల చూపు పడింది. అయితే, ఫారం 26AS, వార్షిక సమాచార నివేదిక (AIS), ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరి (TIS)లోని వివరాలను తనిఖీ చేసిన తర్వాత ఫైల్ చేసిన ఐటీఆర్స్‌ని సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం ప్రాసెసింగ్ మొదలు పెడుతుంది. మే 31, టీడీఎస్ వివరాలు అప్డేట్ అయిన తర్వాతే ఈ ప్రాసెసింగ్ అనేది మొదలవుతుందని సమాచారం. అయితే, ఈ జూన్ నెలలోనే ప్రాసెసింగ్ ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ప్రాసెసింగ్ సమాచారం ట్యాక్స్ పేయర్లకు అందిస్తారు. ఆ తర్వాత 5- 7 రోజుల్లో రీఫండ్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్నుల గడువును ఇటీవలే సీబీడీటీ పొడిగించింది. జులై 31 నుంచి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చారు. ఆలోపు ఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఉద్యోగులు జూన్ 15 తర్వాత ఫారం 16 వచ్చాక ఫైల్ చేయడం మంచిదని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ముందుగా ఫైల్ చేసిన వారికి వేగంగా రీఫండ్ వచ్చేందుకు అవకాశం ఉంటుందనీ చెబుతున్నారు.