లో గెలుపు దిశగా భారత్ పయనిస్తోంది. ఇంగ్లండ్ ఎదుట 608 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ విజయానికి ఆఖరి రోజు 536 పరుగులు కావాల్సి ఉంది.భారత్ నిర్దేశించిన 608 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు 11 పరుగుల వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన జాక్ క్రాలీని డకౌట్ చేసి మొదటి వికెట్ దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన బెన్ డకెట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 బంతులు ఆడిన డకెట్ ఐదు ఫోర్లతో 25 పరుగులు చేశాడు. దాంతో 30 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఓలీ పోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనుకునే సమయంలో జో రూట్ కూడా వికెట్ కోల్పోయాడు. ఆకాశ్ దీప్ వేసిన అవుట్ స్వింగ్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 16 బంతులు ఆడిన జో రూట్ కేవలం 6 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన ఓలీ పోప్ రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ కూడా వికెట్ పడకుండా రాణించాడు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఈ టెస్టులో ఇంగ్లండ్ విజయంసాధించాలంటే ఆఖరి రోజు 536 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (15) ఉన్నారు. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌కి ఒక వికెట్ దక్కింది. ఇక నాలుగో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి మినహా మిగతా బ్యాటర్లంతా ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ 162 బంతుల్లో 13 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 161 పరుగులు చేసి అవుటయ్యాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 58 బంతుల్లోనే 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో క్రీజులో ఉన్నంత సేపు చుక్కలు చూయించాడు. అంతకు ముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ 84 బంతుల్లో పది ఫోర్లతో 55 పరుగులు చేసి అవుటయ్యాడు.రవీంద్ర జడేజా కూడా 118 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69 పరుగులు, వాషింగ్టన్ సుందర్ ఏడు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 12 పరుగులతో ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైన నితీష్ కుమార్ రెడ్డి, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు.