ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తలిద్దరూ తప్పక ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. అయితే ఉద్యోగ బాధ్యతలు నిర్వహణ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. పిల్లల ఆలనాపాలనా వారి మీదనే ఉంటుంది. వీటన్నింటిని చూసుకుంటూనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయితే పర్లేదు కానీ.. నెలల పిల్లలలు ఉన్న తల్లులకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కత్తి మీద సాము లాంటిదే. ఇంట్లో పిల్లలను చూసుకునే వారు ఉంటే పర్లేదు.. లేదంటే ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది అని చెప్పవచ్చు.మహిళలు ఇటు జాబ్.. అటు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని ప్రదేశాల్లో క్రెష్‌లు (చిన్నారుల సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 216 ప్రాంతాలను గుర్తించి, అక్కడ క్రెష్‌లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది. కేంద్ర సహకారం కోసం నివేదికను పంపింది.ఎక్కువ మంది అంటే సుమారుగా 100 మంది కంటే ఎక్కువ ఆడవారు పని చేస్తున్న చోట క్రెష్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి అన్ని కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, జిల్లా కోర్టులు, గవర్నమెంట్ ఆసుపత్రులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు, జిల్లా పంచాయతీ కార్యాలయాలు, పురపాలక ఆఫీసుల వద్ద క్రెష్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇందుకోసం అమరావతి సచివాలయంలో ఉన్న క్రెష్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆరు నెలలు పైబడిన పిల్లలను ఈ క్రెష్‌లలో చూసుకుంటారు. పిల్లల సంరక్షణ కోసం ఒక కార్యకర్త, ఒక సహాయకురాలు ఉంటారు. ఆట వస్తువులు, ఊయల, బరువు చూసే యంత్రం, బెడ్లు, రిఫ్రిజిరేటర్, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు ఉంటాయి. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్నే పిల్లలకు తినిపిస్తారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల కష్టాలను తొలగించడానికి పని ప్రదేశాల్లో క్రెష్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖ మొదటి అడుగు వేసింది. వీటి ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం సహాయం కోరుతున్న ఏపీ గవర్నమెంట్ వీటికి సంబంధించి ఒక నివేదికను కూడా పంపింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో మహిళా ఉద్యోగినులకు ఊరట లభించనుంది. ఇక పిల్లల గురించి చింత వదిలేసి తాము చేసే పని మీద దృష్టి పెట్టగలుగుతారని అభిప్రాయపడుతున్నారు.