నా ఆట నేను ఆడతా.. రికార్డులు వాటంతట అవే వస్తాయి: జెమీ స్మిత్‌కు పంత్ మాస్ కౌంటర్..!

Wait 5 sec.

భారత్- ఇంగ్లాండ్ మధ్య నాలుగో రోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ రిషభ్ పంత్ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారంది.అసలేం జరిగిందంటే..ఈ మ్యాచులో .. రాహుల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు. వచ్చీరాగానే బాదడం మొదలెట్టాడు. ఇది చూసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు అసహనాన్ని లోనయ్యారు. ఈ క్రమంలో వికెట్ కీపర్ జెమీ స్మిత్ నోటికి పని చెప్పాడు. పంత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతున్న పంత్‌ను 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్ట్‌ల్లో ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకోవాలని జెమీ స్మిత్ సూచించాడు. అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. రికార్డులపై తనకు ఆశ లేదని, తన ఆట తాను ఆడుతానని, రికార్డ్‌లు వాటంతట అవే వస్తాయని రివర్స్ పంచ్ ఇచ్చాడు.జెమీ స్మిత్: 'టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ 55 బంతుల్లో నమోదైంది. ఈ రోజు నువ్వు ఆ రికార్డుు అందుకోగలవు'రిషభ్ పంత్: 'నేను రికార్డుల కోసం ఆడను. నాకు అంత అత్యాశ కూడా లేదు. నా ఆట నేను ఆడతా.. రికార్డ్స్ వాటంతట అవే వస్తాయి'కాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రిషభ్ పంత్.. రెండు సెంచరీలు చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి ఔట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటాడు. 58 బంతుల్లో 65 పరుగులు స్కోరు చేసి.. జట్టు భారీ స్కోరు సాధించడంలో తన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఏకాగ్రతతో ఆడుతున్న పంత్‌ను రెచ్చగొట్టేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రయత్నించారు. కానీ సంయమనంతో ఉన్న పంత్.. వారి మాటలకు రివర్స్ పంచ్ ఇచ్చాడు.