స్టాక్ మార్కెట్లో రూ.44 వేల కోట్ల స్కామ్.. సెబీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

SEBI: స్టాక్ మార్కెట్లో మోసపూరిత లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మార్కెట్ల నియంత్రణ సంస్థ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక విధానాల ద్వారా అక్రమంగా లాభాలు పొందాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మన దేశీయ మార్కెట్లలో చట్ట వ్యతిరేకం విధానాల ద్వారా అక్రమంగా రూ.44 వేల కోట్ల మేర ఆర్జించిన అమెరికాలోని న్యూయార్క్ కేంద్రగా పని చేస్తున్న హెడ్జ్ ఫండ్ మేనేజర్ జేన్ స్ట్రీట్ తీరుపై సెబీ మండిపడింది. ఈ కుంభకోణం బయటపడిన క్రమంలో జేన్ స్ట్రీట్‌కు సెబీ రూ.4843 కోట్ల మేర జరిమానా విధించింది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద జరిమానా కావాడం గమనార్హం. స్టాక్ ఎక్స్చేంజీలు, సెబీ పరిధిలోని మార్కెట్ లావాదేవీలపై నిఘా పెంచామని తెలిపారు. ఇతర విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఎవరైనా జేన్ స్ట్రీట్ మాదిరిగా అక్రమ లావాదేవీలు నిర్వహించారా అని ప్రశ్నించగా అక్రమాలకు ఎవరు పాల్పడినా సంహించబోమని తేల్చి చెప్పారు. నియంత్రణను మరీ అధికం చేయమని, అయితే, పారదర్శకత కోసం నిశిత పరిశీలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ స్కామ్.. ఈ క్రమంలోనే ఆ కంపెనీకి రూ.4843 కోట్ మేర జరిమానా విధించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెబీ ఇంత భారీ పెనాల్టీ విధించడం ఇదే తొలిసారి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు స్టాక్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని నిషేధం విధించింది. ఇప్పుడు ఈ విషయం స్టాక్ మార్కెట్లలో సంచలనంగా మారింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న జేన్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ లోని నగదు విభాగం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కార్యకలాపాల ద్వారా సూచీల ధరలను నియంత్రించి హెచ్చుతగ్గులకు లోన్ చేస్తుంది. ఇలా చేస్తూ అనూహ్యంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు సెబీ గుర్తించింది. ముఖ్యంగా లిక్విడిటీ అధికంగా ఉండే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్లలో ఇలాంటి అక్రమ ట్రేడింగ్ నిర్వహించినట్లు సెబీ తెలిపింది. 2023 నుంచి 2025 మే వరకు నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో భారీ లావాదేవీలు సాగించి వేల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది.