క్వాలిఫయర్‌- 2లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి.. తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించిన ఆ జట్టు సెమీఫైనల్ లాంటి మ్యాచ్‌లోనూ సత్తాచాటుతోంది. లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ముంబై. అయిేత వర్షం కారణంగా 2.15 గంటలు ఆలస్యంగా అంటే 9.45 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది. కొత్త రూల్స్ ప్రకారం ఎలాంటి ఓవర్ల కుదింపు లేకుండానే మ్యాచ్ మొదలైంది. అయితే బ్యాటర్లంతా సమష్టిగా రాణించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 రన్స్ స్కోరు చేసింది.గత మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసిన రోహిత్ శర్మ.. క్వాలిఫయర్‌-2లో మాత్రం సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 8 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అయితే మిగతా బ్యాటర్లు జానీ బెయిర్‌ స్టో (24 బంతుల్లో 38 రన్స్‌), తిలక్ వర్మ (29 బంతుల్లో 44 రన్స్‌), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 44 రన్స్‌) రాణించారు. దీంతో ముంబై ఇండియన్స్ ఓవర్‌కు 10 రన్స్‌కు తగ్గకుండా స్కోరు చేసింది.చివర్లో నమన్ ధీర్ ముంబైకి మంచి ఫనిషింగ్ ఇచ్చాడు. 18 బంతుల్లో 37 రన్స్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 రన్స్ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 203 రన్స్ లక్ష్యాన్ని నిలిపింది.పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, విజయ్ కుమార్ వైశాక్ 1, 1, మార్కస్ స్టోయినిస్ 1, కైల్ జెమీసన్ 1 వికెట్ తీశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్షదీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లు వేసి.. ఓవర్‌కు 11 చొప్పున అంటే 44 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.