బంగారం కొనేవారికి ఊరట.. రెండ్రోజులుగా మారని ధర.. ఈరోజు తులం రేటు ఇదే!

Wait 5 sec.

: భారతీయుల జీవన విధానంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. వేల సంవత్సరాల నుంచే భారతీయుల జీవితంలో ఒక భాగమైపోయింది. బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. అత్యవసర సమయంలో ఆదుకునే సాధనంగానూ పసిడి నిలుస్తోంది. ఇటీవలి కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడుల కోసమూ బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మన దేశంలో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇటీవలి కాలంలో పురుషులు సైతం పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రతి ఏటా దేశంలోకి టన్నులకు టన్నుల బంగారం దిగుమతి అవుతుంది. అయితే, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాల భయాల వంటి కారణాలతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది కొనేందుకు వెనకడుగు వేయాల్సి వస్తోంది. అయితే, గత రెండు రోజులుగా మాత్రమే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు.. దీంతో పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3308 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ ఔన్స్ రేటు 33.04 డాలర్లుగా ఉంది. మరోవైపు.. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోయింది. ఇవాళ రూ.85.550 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు.. ఇవాళ 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఏ మార్పులు లేకుండా 10 గ్రాములకు రూ.89 వేల 200 వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు సైతం మారలేదు. రెండ్రోజులుగా తులం బంగారం రేటు రూ. 97 వేల 310 వద్దే కొనసాగుతోంది. మూడు రోజులుగా వెండి స్థిరం.. బంగారంతో పాటు వెండి రేటు సైతం స్థిరంగానే కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వెండి రేటులో మార్పు లేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏ మార్పు లేకుండా రూ. 1,10,900 వద్ద కొనసాగుతోంది. ఈ కథనంలో పేర్కొన్న బంగారం, జూన్ 2వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి బంగారం, వెండి రేట్లలో మార్పు రావచ్చు. అలాగే ట్యాక్సులు కలిపితే ప్రాంతాల వారీగా ధరలు వేరు వేరుగా ఉంటాయి. కొనేముందే తెలుసుకోవడం ఉత్తమం.