తిరుమలలో ఆ వీడియో తీసింది టీటీడీ ఉద్యోగి..భక్తుడ్ని రెచ్చగొట్టి, అంతా ఆయనే చేశారట!

Wait 5 sec.

తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్‌లో నిరసన తెలిపిన వ్యక్తి వైఎస్సార్‌సీపీకి నాయకుడిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిరసన తెలుపుతున్న సమయంలో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే టీటీడీ ఉద్యోగి భక్తుడి వీడియోను తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తెలుస్తోంది. ఈ నిరసనను టీటీడీ ఆరోగ్య విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి వీడియో తీయగా.. తర్వాత ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యోగిని విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కాకినాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.అచ్చారావు టీటీడీ ఛైర్మన్, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అచ్చారావు నిరసన తెలుపుతున్న సమయంలో ఉద్యోగి ప్రోత్సహించారని.. ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందంటున్నారు. అలాగే ఇటీవల వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. టీటీడీలో తమ వాళ్లు రెండు వేల మంది పనిచేస్తున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో నిఘా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అచ్చారావు నినాదాలు చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చన తర్వాత తాను పొరపాటు చేశానని క్షమాపణ అడిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు తాను విచక్షణ కోల్పోయానని.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. అయినా సరే పోలీసులు అతడిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. రాజకీయ కోణంలో వివాదం సృష్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఈ చర్య తీసుకున్నారు. అలాగే టీటీడీలో పనిచేస్తూ అసలు ఈ వీడియో ఎందుకు తీశారు?.. ఎందుకు బయటపెట్టారనే పలు అంశాలపై టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఉద్యోగి ఎపిసోడ్‌పై టీటీడీ ఇప్పటి వరకు అధికారిక ప్రకనట చేశారు.