ఆరో టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. క్వాలిఫైయర్ 2లో పంజాబ్ డిసైడింగ్ విక్టరీతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. బౌలింగే బలం అనుకున్న ముంబైని అదే ఓడించింది. బుమ్రాతో సహా అందరూ విఫలమవ్వడంతో పంజాబ్ సునాయాస విజయాన్ని అందుకుని ఫైనల్‌లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చింది. వర్షంతో అసలు క్వాలిఫైయర్ 2 ప్రారంభమవుతుందా? లేదా? అన్న సంశయంతో ఆరంభమైన మ్యాచ్ ఏకంగా 20 ఓవర్లు మ్యాచ్ జరిగడం.. ఆఖరి వరకు ఉత్కంఠ రేపడంతో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ దొరికినట్టయింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. మిడిల్ ఓవర్లలో రాణించిన ముంబై ఆఖర్లో వికెట్లు కోల్పోవడంతో ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అహ్మదాబాద్ లాంటి గ్రౌండ్‌, క్వాలిఫైయర్ 2 లాంటి టెన్షన్ మ్యాచ్‌లో 204 టార్గెట్ అంటే చాలా పెద్ద విషయమే. అందులోనూ వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్న ముంబైపై చాలా కష్టమనే చెప్పాలి. కానీ పంజాబ్ కింగ్స్ తడబడకుండా చాలా కూల్‌గా టార్గెట్‌ను ఛేదించి రాయల్‌గా ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చారు. శ్రేయాస్ అయ్యర్ 87 పరుగుతో నాటౌట్‌గా నిలవడంతో కేవలం 19 ఓవర్లలోనే పంజాబ్ విజయం సాధించింది. ఈ నెల 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్స్‌లో ఆర్సీబీతో పంజాబ్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమికి ఆ జట్టు బౌలింగే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. జస్ప్రిత్ బుమ్రాతో సహా అందరూ విఫలమయ్యారు. ముంబై ముగ్గురు పేసర్లు పదికి పైగా పరుగులు సమర్పించుకోవడం, అందులో ఇద్దరు కనీసం ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడమే ముంబై ఓటమికి మెయిన్ రీజన్. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నప్పటికీ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా నలభై పరుగులు సమర్పించుకున్నాడు. టాప్‌లే అయితే మూడు ఓవర్లలోనే 40 పరుగులు ఇచ్చాడు. అశ్వని కుమార్ రెండు వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో భారీగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 38 పరుగులు ఇచ్చాడు. ఎలిమినేటర్‌లో గెలిచిన తర్వాత మూడు సార్లు క్వాలిఫైయర్ 2కి వచ్చిన ముంబై మూడుసార్లూ ఓడిపోయి చెత్త రికార్డ్ మూటగట్టుకుంది.