భద్రాచలం ఆలయంలో అపచారం.. ఏంటి రామా ఇది..!

Wait 5 sec.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన లో చోటుచేసుకున్న ఓ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్వామివారికి సమర్పించిన శేషవస్త్రాలు కొనుగోలు చేస్తే దైవ కటాక్షం లభిస్తుందని . అయితే.. దేవస్థానం నుంచి హక్కులు పొంది శేషవస్త్రాలు విక్రయించే ఓ దుకాణంలో.. ఆదివారం అన్యమత ప్రచారానికి సంబంధించిన సంచుల్లో వస్త్రాలు పెట్టి విక్రయించడం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామం ఆలయ పవిత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.భక్తులు రామయ్య తమ మొక్కులలో భాగంగా సీతారాములకు నూతన వస్త్రాలను సమర్పిస్తుంటారు. ఈ వస్త్రాలను సేకరించి.. ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తుంటారు. ఈ దుకాణం నిర్వహణకు ఒక వ్యాపారి ఆలయానికి ఏటా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ దుకాణంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక విధంగా భక్తులకు అంటగట్టి అపచారం చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆలయ నియమ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కొందరు భక్తులు శ్రీరామయ్య దర్శనానికి వచ్చి.. రూ.1,100 చెల్లించి రెండు శేషవస్త్ర చీరలను కొనుగోలు చేశారు. దుకాణంలో పని చేస్తున్న సిబ్బంది వాటిని రెండు సంచుల్లో పెట్టి భక్తులకు అందజేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉండటం చూసి భక్తులు అవాక్కయ్యారు. ఇదేంటని దుకాణదారుడిని అడిగితే సరైన సమాధానం రాలేదని.. దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు.సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది వెంటనే దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని సంచులపై నిజంగానే అన్యమత ప్రచార స్లోగన్‌లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ సంచులను అక్కడి నుంచి తొలగించినట్టు సమాచారం. ఈ విషయమై దుకాణ నిర్వాహకులు మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న అన్ని సంచులపై దేవస్థానం చిత్రాలే ఉంటాయని.. అన్యమత స్లోగన్‌ ఉన్న సంచులు తమకు తెలియకుండా ఎలా వచ్చాయో కూడా అర్థం కావడం లేదని వివరణ ఇచ్చారు. ఆలయ సిబ్బంది మాత్రం ఒకటి, రెండు సంచులపై మాత్రమే అన్యమత ప్రచార స్లోగన్‌ ఉన్నాయని.. వాటిని తొలగించామని, అవి ఎలా వచ్చాయో తెలుసుకుంటామని చెప్పారు. ఆలయ ఈఓ రమాదేవిని మీడియా ప్రతినిధులు వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. ఈ ఘటన ఆలయ భద్రత, పర్యవేక్షణపై మరింత పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.