కోహ్లీ కల తీరేనా? శ్రేయస్ మళ్లీ మాయ చేస్తాడా? ఐపీఎల్ విజేతపై AI ప్రిడిక్షన్ ఇదే..

Wait 5 sec.

Winner AI Prediction : తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు (జూన్ 3) రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ రెండు జట్లు ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాయి. 'ఈ సాలా కప్ నమ్దే' ట్యాగ్ లైన్‌కు జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలని ఆర్సీబీ భావిస్తుండగా.. మంచి ఫామ్‌ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ సైతం దూకుడుగా ఉంది. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ గెలిచే జట్టుపై ఎవరి అంచనాలు వారివే. కొందరైతే విజేత ఎవరనేది అంచనా వేయడ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈసారి ఐపీఎల్ 2025 టైటిల్ నెగ్గేది ఆర్సీబీనేనని ఎక్స్ గ్రోక్ ఏఐ, జెమిని, చాట్ జీపీటి ప్లాట్ ఫామ్స్ తేల్చి చెప్పాయి. ఈ అంచనాకు ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించాయి. X GROK : "పంజాబ్ తో జరిగిన క్వాలిఫయర్ 1లో అద్భుత ప్రదర్శన చేసి 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలిచింది. జోష్ హేజిల్ వుడ్, సుయాష్ శర్మ వంటి బౌలర్లతో బెంగళూరు జట్టు బౌలింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపుతోంది. ఆర్సీబీ అహ్మదాబాద్‌లో చారిత్రక ప్రదర్శన చేయడం, తీవ్ర ఒత్తిడిని సైతం తట్టుకుని ఆటను మలుపు తిప్పే సామర్థ్యం ఆర్సీబీ గెలుపుపై అంచనాలు పెంచాయి. ఇక డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్లు కూడా ఆర్సీబీ గెలుస్తుందని అంచనా వేశారు. ఆర్సీబీ గెలవడమే కాకుండా.. హేజిల్‌వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలుస్తాడని వార్నర్ జోస్యం చెప్పాడు" అని గ్రోక్ వివరించింది. "క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ విధించిన 203 లక్ష్యాన్ని పంజాబ్ అద్భుత ప్రదర్శన చేసి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్(87) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ జట్టులో లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ వంటి ప్లేయర్లు ప్రమాదకరంగా మారగలరు. కైల్ జెమీసన్, యుజ్వేంద్ర చాహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. కానీ క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో ఒత్తిడిలో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇక ఆర్సీబీ ప్రస్తుత ఫామ్, బలమైన లైనప్ చూస్తుంటే ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశం ఉంది" అని గ్రోక్ ప్రిడిక్ట్ చేసింది. Gemini: "గత కొద్ది మ్యాచుల్లో ఆర్సీబీ ప్రదర్శన చూస్తే ఈ జట్టే ఐపీఎల్ కొట్టేలా కనిపిస్తోంది. అయితే మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రదర్శన, టాస్, వాతావరణ పరిస్థితులు గెలుపును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టోర్నీలో పంజాబ్ కూడా అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. ఈ రెండు జట్లూ గెలిచేందుకు పలు కారణాలు ఉన్నాయి. అయితే పంజాబ్, బెంగళూరులో ఐపీఎల్ టైటిల్ గెలిచే ఒక జట్టు ఎంపిక చేయమంటే నా ఛాయిస్ ఆర్సీబీనే" అని జెమిని ఏఐ తెలిపింది.ChatGPT : "ఆర్సీబీ నిలకడైన ఫామ్, ఇటీవల గెలిచిన మ్యాచ్‌లను చూస్తే ఫైనల్లో బెంగళూరే హాట్ ఫేవరెట్‌గా నిలవనుంది. అయితే పంజాబ్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది" అని చాట్ జీపీటీ అంచనా వేసింది.