తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. రాష్ట్రంలో 6 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోని కార్డుదారులు 1.59 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై విచారణ జరిపి.. అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే 80 శాతం కార్డులపై విచారణ పూర్తవ్వగా.. వాటిలో 30 శాతం అనర్హులే అని తేలినట్లు సమాచారం. వీరిలో కొందరు చాలా నెలలుగా రేషన్ తీసుకోనివారు ఉండగా.. మరికొందరు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినవారు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కార్డులన్నీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ కారణంగా రేషన్ షాపుల వద్ద భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. 3 నెలల సరుకులు ఒకేసారి తీసుకునే ప్రక్రియలో 3 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం, ఈ-పాస్ సాఫ్ట్‌వేర్‌లో తీవ్ర సమస్యలు ఎదురవుతుండటంతో లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మీసేవా కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకున్న లబ్ధిదారులకు 2 లక్షల కార్డులు మంజూరు చేశారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనర్హుల కార్డుల తొలగింపు పూర్తయిన తర్వాత.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరింతరాయంగా కొనసాగుతుందని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని ఇది వరకే మంత్రులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.