ఆంధ్రప్రదేశ్‌లో మరో నేషనల్ హైవే పనులు ముగింపు దశకు వచ్చాయి. కర్నూలు జిల్లాలో నన్నూరు టోల్‌ ప్లాజా నుంచి ఆత్మకూరు వరకు 340సిరూ.1179 కోట్లతో 66.115 కి.మీ మేర నాలుగు లైన్లుగా నిర్మిస్తున్నారు. ఈ పనులు 2023లో ప్రారంభంకాగా.. అక్టోబరు నాటికి పూర్తి చేయాలని భావస్తున్నారు. ఈ రోడ్డు గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు మీదుగా ఆత్మకూరు, దోర్నాల వరకు వెళ్తుంది. ఈ హైవే పనుల్ని రెండు దశల్లో నిధులు కేటాయించారు.. ఫేజ్-1 కింద 35.515 కి.మీ.లకు రూ.587 కోట్లు.. అలాగే ఫేజ్-2 కింద 30.6 కి.మీ.లకు రూ.591 కోట్లు ఖర్చు చేస్తున్నారు.ప్రస్తుతం నన్నూరు నుండచి నందికొట్కూరు వరకు పూర్తయ్యాయి. అయితే పనులు వేగంగా జరుగుతున్నా.. రోడ్డు నాణ్యత బాగాలేదని ప్రజలు అంటున్నారు. ఈ రోడ్డు పనుల కోసం నాణ్యమైన మట్టిని ఉపయోగించలేదనే విమర్శలు వచ్చాయి. ఈ హైవేకు ఇరువైపులా వేసిన మట్టి కట్టలు వర్షానికి కొట్టుకుపోయాయంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పక్కన మట్టి కోతకు గురై గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు పనులకు సంబంధించి నాణ్యత లేని మట్టి వాడారంటున్నారు. అలాగే రోడ్డు పక్కన బండరాళ్లు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. వాస్తవానికి నిర్మాణ పనుల్లో నాణ్యమైన మట్టి వాడాలి.. కానీ మట్టి వేసిన తర్వాత నీళ్లు చల్లి రోలింగ్ చేయలేదంటున్నారు. అందుకే ఈ మట్టి గట్టిపడలేదని.. కోతకు గురైందంటున్నారు. ఇలా చిన్న వర్షానికే మట్టి కోతకు గురై రాళ్లు బయటపడుతున్నాయి అంటున్నారు. అంతేకాదు వర్షం నీరు నిలవకుండా కాంక్రీటు పలకలతో ఏర్పాటు చేసిన కాల్వలు కూడా పక్కకు జరిగాయంటున్నారు. అయితే కోతలకు గురైన చోట మట్టి వేశారు. కానీ అందులో పెద్ద రాళ్లు ఉన్నాయి.. ఒకవేళ వాహనాలు అంచులకు వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటన్నారు. జాతీయ రహదారిపై చెత్తాచెదారం, రాళ్లు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇటీవల ఒక బోరు వాహనం రోడ్డు పక్కన ఆపడానికి ప్రయత్నించగా గోతిలో దిగబడిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే వెంటనే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందంటున్నాు. ఈ హైవే పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలంటున్నారు స్థానికులు.