చెక్‌పోస్టుల్లో ఆ వాహనాలకు ఫీజు తగ్గింపు.. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం

Wait 5 sec.

తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యాల గుండా ధాన్యం తరలించే లారీల నుంచి వసూలు చేస్తున్న పర్యావరణ నిర్వహణ రుసుమును తగ్గించాలని గతంలో ఒక్కో లారీకి రూ.525గా ఉన్న ఈ రుసుమును ప్రస్తుతం రూ.300కి తగ్గించింది. ధాన్యం లారీల నుంచి ఫీజు వసూలు చేయడం ఇటీవల తీవ్ర వివాదానికి దారి తీయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.వివాదానికి కారణం ఏంటంటే...?ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే లారీలు తరచుగా కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వుల మీదుగా వెళ్తుంటాయి. ఈ ప్రాంతాల్లో లారీల నుంచి ఫీజు వసూలు చేయడం మంచిర్యాల జిల్లాలో పెద్ద వివాదంగా మారింది. దీంతో జిల్లా యంత్రాంగం అటవీ శాఖకు లేఖ రాసి.. ధాన్యం తరలించే వాహనాలకు పర్యావరణ రుసుం వసూలు చేయొద్దని కోరింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గిరిజన రైతులు అధికంగా ఉండటంతో ధాన్యం తరలింపు లారీల నుంచి ఫీజు వసూలు చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంచిర్యాల జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు కూడా అందినట్లు తెలుస్తోంది.ప్రకారం.. ఫారెస్ట్ యాక్టులు, టైగర్‌ రిజర్వు నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని అన్నారు. టైగర్‌ రిజర్వుల్లో పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ ముఖ్యమని.. అడవిలో తిరిగే వాహనాలతో వాటి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అందుకే వేగ నియంత్రణ, భారీ వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) నిబంధనల ప్రకారం టైగర్‌ రిజర్వుల్లోకి లారీలు, భారీ వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. రైతుల ధాన్యం తీసుకెళ్తున్నాయన్న ఉద్దేశంతోనే రెండు నెలలు అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు.జాతీయ రహదారుల మీదుగా వెళ్లే ధాన్యం లారీలకు టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ ఫీజు చెల్లించడం లేదా అని ఫారెస్ట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర వాహనాలకూ పర్యావరణ ఫీజును వసూలు చేస్తున్నామని.. ఇలా వచ్చే మొత్తం టైగర్‌ రిజర్వు ఫండ్‌కు వెళుతుందని స్పష్టం చేశారు. పులుల సంరక్షణకు ఈ నిధులు కీలకమని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. ఫీజు పూర్తిగా తొలగించకుండా.. తగ్గిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ తగ్గింపు నిర్ణయం వివాదానికి ముగింపు పలుకుతుందో లేదో చూడాలి.