Currency Notes: రూ.10 నుంచి రూ. 500 వరకు ప్రస్తుతం కరెన్సీ నోట్లు వాడుకలో ఉన్నాయి. నిత్యం మనం వీటిని ఉపయోగిస్తాం. ఏ వస్తువు కొనాలన్నా చేతిలో కరెన్సీ నోటు ఉండాల్సిందే. పెద్ద మొత్తంలో నగదు చలామణిలో ఉంటేనే ప్రజలకు ఇబ్బందులు ఉండవు. ప్రతి సంవత్సరం వేల కోట్లు విలువైన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముద్రిస్తుంది. మరి మనం వాడుతున్న కరెన్సీ నోట్లు ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? బ్యాలెన్స్ షీట్ రూ.76.25 లక్షల కోట్లకు పెరిగినందువల్లే కేంద్ర ప్రభుత్వానికి రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ ఇచ్చామని తెలిపింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇందుకు బలమైన స్థూల ఆర్థిక మూలాలు అండగా నిలుస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు, పర్యావరణ మార్పులు, సరఫరాలో ఇబ్బందులు వంటి అంశాలు ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది. గ్లోబల్ మార్కెట్లో కమొడిటి ధరలు తగ్గుతుండడం, దేశీయంగా వ్యవసాయ దిగుబడి పెరిగినట్లయితే ద్రవ్యోల్బణం మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. గత రెండు ద్వైమాసిక సమీక్షల్లో కీలక పాలసీ రేట్లను తగ్గించిన క్రమంలోనే ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపే కట్టడి చేయగలిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. మార్చి 31 నాటికి మొత్తం మిగులు కిందటితో పోలిస్తే 27.37 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక విదేశీ మారకపు ట్రాన్సాక్షన్ల ద్వారా లాభాలు 33 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు.. ఇది అంతకు ముందు ఏడాది 2023-24లోని రూ.5,101.4 కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. 2024-25లో చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల విలువ, పరిమాణ వరుసగా 6 శాతం, 5 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. రూ.500 నోట్లా వాటా విలువ పరంగా 86 శాతంగా ఉండగా, పరిమాణం పరంగా 40.9 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2023, మే నెల నుంచి రూ.2000 బ్యాంక్ నోట్ల ఉపసంహరణ కొనసాగుతోందని, ఈ ఏడాది మార్చి 31 నాటికి 98.2 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు వివరాలు వెల్లడించింది. రూ.2, రూ.5, రూ.2000 నోట్లను కొత్తగా ముద్రించడం లేదని తెలిపింది. ఇక రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.2000 నోట్లలో నకిలీ నోట్లు తగ్గాయని, అయితే రూ.200, రూ.500 నోట్లలలో 13.9 శాతం, 37.3 శాతం మేర ఫేక్ నోట్లు పెరిగాయని తెలిపింది.