ను సొంతం చేసుకుంది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రికార్డు సృష్టించిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఆర్సీబీ సాధించిన ఈ విజయం చిరస్థాయిగా నిలవడం ఖాయం. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. అయితే ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 50 పరుగులకే సగం టీమ్ డగౌట్‌లో కూర్చోగా.. 101 పరుగులకే ఆలౌట్ అయ్యారు.ఐపీఎల్ ప్లే ఆఫ్స్ హిస్టరీలో ఒక టీమ్‌ని ఇలా 15 ఓవర్లలోపే ఆలౌట్ చేసిన ఘనత ఇప్పటి వరకు ఏ జట్టుకు లేదు. ఫస్ట్ టైమ్ ఐపీఎల్‌లో ఆర్సీబీ ఈ రికార్డును సృష్టించి బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 14.1 ఓవర్లలో పంజాబ్ కింగ్స్‌ను ఆర్సీబీ బౌలర్లు ఆలౌట్ చేసి మ్యాచ్‌ని వన్ సైడ్ చేశారు. 102 పరుగులతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఏమాత్రం తడబడకుండా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించి ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆర్సీబీ అడుగుపెట్టడం ఇది నాలుగో సారి. అయితే ఒక్కసారి కూడా ఫైనల్‌లో గెలిచి ట్రోఫీ అందుకోలేదు. 2016 తర్వాత దాదాపు దశాబ్దం వెయిట్ చేసి ఇప్పుడు మళ్లీ 2025లో ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలిసారిగా 2009 ఫైనల్‌లో ఆడిన ఆర్సీబీ అప్పటి హైదరాబాద్ టీమ్ డెక్కన్ ఛార్జస్ మీద ఓడిపోయింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పరాభవం పొందింది. మళ్లీ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చావు దెబ్బ తినింది. మరి ఈసారైనా టైటిల్‌తో వెళ్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.