నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి మాత్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తాజా భూకంపానికి సంబంధించిన కేంద్రం హొక్కైడో తూర్పు తీరంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ప్రస్తుతం సంభవించిన భూకంపం ధాటికి జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. హొక్కైడో తీరంలో శుక్రవారం సాయంత్రం 5:37 గంటలకు భూకంప కేంద్రం కుషిరోకు ఆగ్నేయంగా ఉన్నట్లు గుర్తించారు. కుషిరో సిటీ, కుషిరో టౌన్, షిబేచా టౌన్ వంటి ప్రాంతాల్లో గరిష్టంగా 7 పాయింట్లలో 4 పాయింట్ల తీవ్రతతో భూకంపం నమోదైందని వెల్లడించారు. ఒబిహిరో సిటీ, నెమురో సిటీ, హోన్షులోని అమోరి ప్రిఫెక్చర్‌లోని హచినోహె సిటీ వంటి ఇతర ప్రాంతాల్లో 3 పాయింట్ల భూకంప తీవ్రత నమోదైందని తెలిపారు.జపాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నివేదికల ప్రకారం.. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సంఘటన జపాన్‌లో భూకంప కార్యకలాపాలపై తీవ్ర ఆందోళనలను పెంచింది. నన్కై ట్రఫ్ వెంబడి ఒక పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉందని నిపుణులు గతంలో హెచ్చరించారు. ఆ భూకపం.. తీవ్ర వినాశకరమైన పరిస్థితులను కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భూకంపం సంభవించడంతో ఆ ఆందోళనలు మరింత తీవ్రం అయ్యాయి.