ఎయిరిండియా 'లాస్ట్ మినట్ సేల్'.. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లు.. జూన్ 4 వరకు బుకింగ్స్!

Wait 5 sec.

Flight Ticket: విమాన ప్రయాణం అంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. టికెట్ ధరలు అలా ఉంటాయి మరి. తక్కువ దూరానికైనా వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక అంతర్జాతీయ విమానాల్లో వేలు కాదు లక్షల్లో వెచ్చించాల్సి వస్తుంది. అయితే, తరుచూ విమాన ప్రయాణాలు చేసే వారైనా, ఒక్కసారైనా విమానా ఎక్కాలి అనుకునే వారైన ప్రత్యేక సేల్ ద్వారా విమాన టికెట్లపై తగ్గింపు పొందవచ్చు. పరిమిత కాల ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. అయితే, అవి ఎప్పుడు ఉంటాయి అనేది తెలుసుకుంటూ ఉండాలి. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) మరోసారి ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది. లాస్ట్ మినట్ సేల్ పేరుతో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఇస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. అయితే, ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఈ స్పెషల్ సేల్ మే 29వ తేదీనే మొదలైంది. జూన్ 4, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. LASTMINUTE కోడ్ ఉపయోగించి డిస్కౌంట్ పొందవచ్చు ఈ ప్రత్యేక సమయంలో టికెట్లు బుక్ చేసుకుని మే 30, 2025 నుంచి జూన్ 5, 2025 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అయితే, ఇది ఎంపిక చేసిన దేశీయ విమాన మార్గాల్లోనే డిస్కౌంట్ లభిస్తుంది. గువాహటి, త్రివేండ్రం, జమ్ము, జోద్‌పూర్, నాగ్‌పూర్, పుణె, ఛండీగఢ్, లెహ్ నగరాల మధ్య నడిచే విమానాల్లో డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ రూట్ల విషయానికి వస్తే ఢిల్లీ- సింగపూర్, ఢిల్లీ- హాంకాంగ్, చెన్నై- సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్- ఢిల్లీ వంటి ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఏ విమానాల్లో డిస్కౌంట్ వస్తుందనేది ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్లో స్పెషల్ సేల్ విభాగంలో చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ జూన్ 4, 2025 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయి. ముందు బుకింగ్ చేసుకున్న వారికి అవకాశం లభిస్తుంది. ప్రోమో కోడ్ అనేది టికెట్ బేస్ ఫేర్ పైనే ఉంటుంది. ఇతర ఆఫర్లతో ఈ ఆఫర్ అనేది జత చేయడం కుదరదు. LASTMINUTE కోడ్ ఉపయోగించి ఆఫర్ పొందవచ్చు. గ్రూప్ బుకింగ్స్ అనేవి అనుమతి ఉండవు. ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న విమానాలకు మాత్రమే వర్తిస్తుంది.