ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందు ఇండియా ఏ టీమ్ సత్తా చాటుతోంది. ఇంగ్లండ్ - భారత్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. అంతకు ముందే ఇండియా ఏ టీమ్, ఇంగ్లండ్ లయన్స్ మధ్య కొన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భాగంగా నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఏ టీమ్ భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ చేసి మరోసారి సత్తా చాటాడు. ఇండియా ఏ టీమ్ - ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 30 నుంచి జూన్ 2 వరకు, జూన్ 6 నుంచి 9 వరకు ఇలా రెండు టెస్టు మ్యాచ్‌లకు షెడ్యూల్ సిద్ధం చేశారు. అందులో భాగంగా మే 30న ప్రారంభమైన నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఏ టీమ్ బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఏ టీమ్ మూడు వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. మొదటి రోజు సెంచరీ చేసిన కరుణ్ నాయర్, రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇండియా ఏ టీమ్ 409/3 పరుగులు చేయగా.. కరుణ్ నాయర్ 186, 82 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. 281 బంతులు ఆడిన కరుణ్ నాయర్ 26 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 204 పరుగులు చేయగా.. ధృవ్ జురెల్ 120 బంతుల్లో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 24, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 119 బంతులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 13 ఫోర్లతో 92 పరుగులు చేసి అవుటయ్యాడు. తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి రెండో రోజు దారుణంగా విఫలమయ్యాడు. ధృవ్ జురెల్ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టగా, శార్థూల్ ఠాకూర్ 27 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ రాణించడంతో ఇండియా ఏ టీమ్ 500 మార్క్‌ను దాటింది. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లోనూ రాణించడంతో బీసీసీఐ సెలక్టర్లు ఆనందంలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లోనూ కరుణ్ నాయర్ పేరు ఖరారైంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అందరి ఆశలు ఇప్పుడు నాయర్‌పైనే ఉన్నాయి.