.. మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్‌విడియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం యువతకు ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా.. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎన్‌విడియా సహకరించనుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి సమక్షంలో.. ఎన్‌విడియా ప్రతినిధులు, ఏపీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని పదివేల మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్.. అందిస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే 500 అంకుర పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు అందివ్వనున్నారు. మరోవైపు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గతేడాది అక్టోబర్ నెలలో ఎన్‌విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో భేటీ అయ్యారు. ముంబయిలో జరిగిన సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా నారా లోకేష్ జెన్సన్ హువాంగ్‌ను కోరారు. ఎన్‌విడియా సీఈవో అప్పట్లో దీనికి అంగీకరించగా.. తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం, ఎన్‌విడియా సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో పది వేల మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ ఏఐ మీద ట్రైనింగ్ అందించనున్నారు. దేశంలోనే అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఏపీ రాజధాని ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం అమరావతి కేంద్రంగా 2026 జనవరి నుంచి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించాలి. మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం భూమిని కూడా కేటాయించారు. ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం ప్రాంతాల్లో క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది.