మాగంటి గోపినాథ్ మృతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది

Wait 5 sec.

సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.15 గంటలకు తుది శ్వాస విడిచారు. మూడురోజుల క్రితమే గోపినాథ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. గోపినాథ్ మృతి పట్ల వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, . ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. ఇక గోపినాథ్ మృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.అధికార లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అలానే ఏఐజీ ఆస్పత్రిలో మాగంటి చికిత్సకు అయిన మొత్తం ఖర్చుని ప్రభుత్వమే భరించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఈరోజే అనగా ఆదివారం నాడే మాగంటి అంత్యక్రియలు నిర్వహించన్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరుగుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాగంటి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆదివారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో రాహుకాలం సమీపించే లోపలే.. గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన రేవంత్ సర్కార్‌కి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా ఉందని.. అందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. మూడు రోజుల క్రితం అనగా జూన్ 5న గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హస్పిటల్‌కి వెళ్లగానే వైద్యులు ముందుగా గోపినాథ్‌కి సీపీఆర్ చేయడంతో అప్పటికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మాగంటి గోపినాథ్ మరణించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలుగు దేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో టీడీపీ, ఆ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్.. మొత్తం మూడు సార్లు.. జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.