తిరుమలలో అరుదైన ఘట్టం.. స్వామివారి బంగారు కవచం తొలగింపు.. కారణమిదే

Wait 5 sec.

శ్రీవారి వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. భక్తుల చేత కలియుగదైవంగా కీర్తింపబడుతూ.. నిత్యం పూజలు, ఉత్సవాలతో అలరారుతుంటారు. అలంకార ప్రియుడైన శ్రీవారికి.. నిత్యం విశిష్ట సేవలు జరుగుతుంటాయి. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్వామి వారికి విశిష్టాలంకాలు చేస్తారు. అలానే త్వరలోనే తిరుమలలో అరుదైన అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. దీనిలో భాగంగా స్వామి వారి బంగారు కవచాన్ని తొలగించనున్నారు. ఆవివరాలు.. రేపటి నుంచి అనగా.. జూన్ 9-11 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. అవే సాలకట్ల ఉత్సవం. ప్రతి ఏడాది ఈ ఉత్సవం నిర్వహిస్తారు. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రం నాడే ముగిసేలా.. తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగామొదటిరోజు నాడు.. శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం వంటి సేవలు నిర్వహిస్తారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత తొలగించిన బంగారు కవచం స్థానంలో స్వామి వారికి వజ్రకవచం అలంకరిస్తారు. మరుసటి రోజు అనగా రెండో నాడు ముత్యాల కవచం సమర్పిస్తారు. ఇక జ్యేష్టాభిషేకంలో చివరి రోజైనా మూడో నాడు.. శ్రీవారికి తిరుమంజనాదులు పూర్తిచేసి.. ఆ తర్వాత మళ్లీ బంగారు కవచాన్ని తిరిగి సమర్పిస్తారు. ఇలా సమర్పించిన బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే సంవత్సరం జ్యేష్టాభిషేకం సమయంలోనే తొలగిస్తారు. అప్పటి వరకు అంటే ఏడాది పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పల్గొంటారు.