హమ్మయ్యా ఆ ఆర్సీబీ బుడ్డోడు.. స్కూల్‌కి వెళ్లాడయ్యో!

Wait 5 sec.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు సార్లు ఫైనల్‌కి వెళ్లి ఓడిపోయిన ఆర్సీబీ.. ఎట్టకేలకు ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో ప్లే ఆఫ్స్‌కి వెళ్లిన ప్రతిసారీ ఫ్యాన్స్ డిఫరెంట్ ఫ్లకార్డులతో కనిపించేవాళ్లు. సోషల్ మీడియాలో ఇప్పటికీ అవి ట్రెండింగ్‌లోనూ ఉన్నాయి. వాటిల్లో నుంచి ఓ బుడ్డోడి కోరిక మాత్రం ఆర్సీబీ తీర్చి.. వాడిని నిరక్షరాస్యుడిని కాకుండా కాపాడింది. ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లి అక్కడ ఓడిపోయింది. అయితే ఆ సమయంలో ఓ బుడ్డోడు ఫ్లకార్డుని పట్టుకుని కనిపించిన ఫొటో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలించేత వరకూ నేను స్కూల్‌కి పోను అంటూ ఓ బుడ్డోడు ఫ్లకార్డుతో కనిపించాడు. అప్పట్లో వాడి వయస్సు మూడేళ్ల లోపే ఉన్నా స్కూల్‌కి వెళ్లకూడదు అన్న వాడి డెడికేషన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అప్పట్లో ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ఈ బుడ్డోడు జన్మలో చదువుకోలేడంటూ కొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తే.. ఇంకొంతమంది అయితే పాపం వీడికి ఇక చదువు రానట్టే అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ సీజన్‌లో హేటర్స్ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతూ చోకర్స్ అన్న ట్యాగ్ లైన్ తీసేసి విన్నర్స్‌గా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న తర్వాత ఈ బుడ్డోడు మళ్లీ ఇంకో ఫ్లకార్డుతో కనిపించాడు. ఈసారి అందులో హే ఆర్సీబీ నేను స్కూల్ జాయిన్ అయ్యా అని రాసుంది. జూన్ 3న ఆర్సీబీ ట్రోఫీ అందుకోవడం.. జూన్ మొదటి వారంలోనే స్కూల్స్ స్టార్ట్ అవ్వనుండటంతో బుడ్డోడు తన మాట నిలబెట్టుకుని స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరల్ అవడంతో.. ఇంతకీ అప్పట్లో పెళ్లిళ్లు చేసుకోను అని చెప్పిన వాళ్ల పరిస్థితి ఏంటో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 18వ ఎడిషన్ ఆర్సీబీకి నిజంగా స్పెషల్ అనే చెప్పొచ్చు. రజత్ పటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్ అందుకుని విరాట్ కోహ్లికి అంకితం చేసింది. ఈ ట్రోఫీ ఫ్యాన్స్ కోసమేనంటూ విరాట్ అభిమానులకు అంకితం చేశాడు.