తిరుమల: శ్రీవారి సన్నిధిలో సిగ్గు లేకుండా ఇదేం పని.. కొంచెమైనా బుద్ధుండక్కర్లా.. వీడియో వైరల్!

Wait 5 sec.

ఏడుకొండలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. శ్రీవారిని నిమిషం పాటు కన్నులారా దర్శించుకోవాలని తపించిపోతుంటారు. పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రత, శ్రీవారి మహిమలు.. భక్తుల నమ్మకానికి కారణం. తిరుమల అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మతస్థులు అందరికీ ప్రత్యేకమైన భావన. హిందూజాతి మొత్తం తిరుమలను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తుంది. అలాంటి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. తిరుమలని కూడా వదలని మందుబాబులు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో మందుబాబులు మద్యం తాగుతున్నారని.. అలా తాగేసిన మందుబాటిళ్లను మెట్లపైకి విసురుతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి మద్యం తాగుతూ ఉన్నారు. అలా తాగిన మందుబాటిల్‌ను పక్కనే ఉన్న మెట్ల మీదకు వేశారు. అయితే ఈ వీడియోలో ఉన్న నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించాల్సి ఉంది.మరోవైపు తిరుమలలో ఇటీవల అన్యమతస్థుడు నమాజ్ చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కళ్యాణ వేదిక సమీపంలో అన్యమతానికి చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేయటం, ఆ దృశ్యాలను స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు కావటం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట వైరల్ కావటంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై తిరుమల పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఆ మధ్య కొంతమంది భక్తులు కలకలం రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు.. పాదరక్షలతోనే శ్రీవారి ఆలయం వరకూ రాగా.. అక్కడి సిబ్బంది గుర్తించి వెనక్కి పంపించేశారు. అయితే అప్పటి వరకూ టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తు్న్నారంటూ భక్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.