ఇంట్లో మూలన దొరికిన కాగితం.. దాని విలువ రూ.80 కోట్లు.. అదృష్టం అంటే నీదే భయ్యా..!

Wait 5 sec.

: అదృష్టం అనేది ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేం. ఒక్క క్షణం చాలు జీవితం మారిపోయేందుకు. ఏమి లేని వారు సైతం కోటీశ్వరులుగా మారిపోయిన సంఘనటలు చాలానే జరిగాయి. ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన సైతం అలాంటిదే. తండ్రి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఏకంగా రూ.80 కోట్లుగా మారింది. ఇంట్లో ఎక్కడో మూలన పడేసిన కాగితం కొడుక్కి దొరకడంతో ఆరా తీస్తే దాని విలువ రూ.80 కోట్లుగా తెలిసింది. జాక్‌పాట్ అంటే ఇదే. తండ్రి పెట్టుబడి ఆ కొడుకు తలరాతే మార్చేసింది. దీర్ఘకాలంలో పెట్టుబడులు ఏ విధంగా లాభాలు అందిస్తాయనేందుకు ఈ సంఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికి సంబంధించిన పత్రాలను ఇంట్లో మూలన పడేశాడు. వాటి గురించి పట్టించుకోలేదు. చూస్తుండగానే 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు అతని కొడుకు ఇంట్లో సామగ్రి సర్దుతుంటే మూలన ఆ షేర్లకు సంబంధించిన పత్రాలు కనిపించాయి. ఈ కాగితాలు ఏంటా అని ఆరా తీసేసరికి ఊహించని విషయం బయటపడింది. ఆ కాగితాలు అని, వాటి విలువ ఊహకందని విధంగా పెరిగిపోయినట్లు తేలింది. అది ఎంత అనుకుంటున్నారు రూ.10 లక్షలు, రూ. 20 లక్షలు అనుకుంటే పొరబడినట్లే. ఏకంగా రూ.80 కోట్లకు చేరింది. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఫలితం వస్తుందనేది చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ. ఈక్విటీల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతుంటాయి. ఒక మంచి కంపెనీలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో హైరిటర్న్స్ ఇస్తుంటాయి. చాలా కంపెనీ షేర్లు ఈ విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు ఈ సంఘటన కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే, ఈ కథనంలో ఎవరికి డబ్బులు వచ్చాయనే విషయం తెలియదు గానీ, సౌరవ్ దత్తా అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.