ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో వసతులు పెంచాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన పద్ధతులను ఇక్కడ అమలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు , గండికోట, సూర్యలంకలో టెంట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను కూడా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేటు సంస్థలు కూడా హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణానికి ముందుకు వస్తున్నాయి.. పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో టెంట్ సిటీని అభివృద్ధి చేస్తారు. మిగిలిన రెండు చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయంతో పర్యాటకులకు 150 గదులు అందుబాటులోకి వస్తాయి.. దీని కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రస్తుతం స్టార్ హోటళ్లలో ఉన్న 11,700 గదుల్ని.. 2028 నాటికి 50 వేలకు పెంచాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలు రూ.12,565 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా 8,073 గదులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో హోటళ్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ‘హోం స్టే’ విధానాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు 1,842 ఇళ్లను గుర్తించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్‌లలో వసతులు తక్కువ ఉన్నాయి.. అందుకే అక్కడ పది ఎకరాల్లో టెంట్ సిటీని ఏర్పాటు చేసి 50 గదులు అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.18 కోట్లకు పైగా ఖర్చు చేస్తారు. లో పది ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టెంట్ సిటీని నిర్మిస్తారు. ఇక్కడ 60 గదులు అందుబాటులోకి వస్తాయి. సాస్కీ పథకంలో భాగంగా గండికోటను రూ.78 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. సూర్యలంక బీచ్‌ను చాలా మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ ఏపీటీడీసీకి రిసార్ట్‌లు ఉన్నప్పటికీ వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అక్కడ గదులు దొరకడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఇక్కడ పది ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 50 గదులు అందుబాటులోకి వచ్చేలా టెంట్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గుజరాత్ అహ్మదాబాద్‌లో కూడా టెంట్ సిటీలు ఉన్నాయి.. వాటికి మంచి ఆదరణ లభించింది. అయోధ్యలో చాలా చోట్ల టెంట్ సిటీలను ఏర్పాటు చేయగా.. అక్కడ సందర్శకులకు వసతి కల్పిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్లాన్ చేస్తున్నారు.