బంగారం తాకట్టు పెడుతున్నారా? RBI కొత్త రూల్స్.. పూర్తి లెక్కలివే.. వాటిపై లోన్ రాదు!

Wait 5 sec.

Gold Loan per Gram: చేసింది. ఈ కొత్త రూల్స్ గోల్డ్ లోన్స్ తీసుకోవడానికి, తిరిగి చెల్లించడానికి మరింత పారదర్శకతను, భద్రతను తీసుకురానున్నాయి. ముఖ్యంగా మోసాలను అరికట్టడం, రుణదాతలకు, రుణగ్రహీతలకు స్పష్టమైన నియమాలు రూపొందించడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఈ సవరణలు జరిగాయని, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFCs) ఒకే తరహా నిబంధనలు ఉండాలన్న ఆర్‌బిఐ లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ ఇక కుదరదు!, ఇకపై రుణదాతలు ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీల్లేదు. అంటే, మీరు డిజిటల్ రూపంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ పొందలేరు. భౌతికంగా ఉన్న బంగారం (నగలు, నాణేలు) ఆధారంగా మాత్రమే గోల్డ్ లోన్స్ తీసుకోవాలి.లోన్ ఎంతొస్తుంది?బంగారం నాణ్యతతో పాటు, తాకట్టు తేదీకి తొలి 30 రోజుల్లో బంగారం సగటు ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే, అంతకు ముందు రోజు ముగింపు ధర ప్రకారమైనా రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వొచ్చో లెక్కించుకోవచ్చు. ఆర్‌బీఐ లోన్-టు-వాల్యూ (LTV) రేషియోల్ని కూడా స్పష్టం చేసింది. ఈ ఇవ్వొచ్చో సూచిస్తుంది.రూ. 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు: LTV 85 శాతంగా నిర్ణయించింది. అంటే ఇక్కడ రూ. లక్ష విలువైన బంగారానికి రూ. 85 వేలు లోన్ వస్తుంది. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలకు LTV 80 శాతంగా ఉంటుంది. ఇక్కడ రూ. 5 లక్షల వరకు విలువైన బంగారానకి రూ. 4 లక్షలు లోన్ పొందొచ్చు. రూ. 5 లక్షలు దాటిన రుణాల విషయానికి వస్తే ఎల్‌టీవీ 75 శాతంగా నిర్ణయించింది. బంగారు రుణాలకు సంబంధించి, తాకట్టు పెట్టే బంగారం పరిమాణంపై కూడా ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.తాకట్టు పెట్టే బంగారం.. వస్తువుల రూపంలో ఉంటే 1 కేజీకి మించకూడదు.వెండి వస్తువులు అయితే 10 కేజీలకు మించకూడదు.గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్ 50 గ్రాములకు మించరాదు.వెండి కాయిన్స్ అయితే ఒక్కో కాయిన్ 500 గ్రాములకు మించరాదు.మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే, మీరు లోన్ తిరిగి చెల్లించిన వెంటనే, అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని మీకు తిరిగి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో, గరిష్ఠంగా 7 పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రుణగ్రహీతలకు తమ బంగారాన్ని సకాలంలో తిరిగి పొందే భద్రతను అందిస్తుంది.రుణదాతకు (బ్యాంకు/NBFC), రుణగ్రహీతకు మధ్య జరిగే ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇది రెండు వర్గాల మధ్య పారదర్శకతను పెంచుతుంది:తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, వాటి విలువను కచ్చితంగా పేర్కొనాలి.అప్పు తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన వివరాలు డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉండాలి.వేలానికి ముందు అప్పును తిరిగి చెల్లించేందుకు రుణగ్రహీతకు ఇవ్వాల్సిన నోటీసు వ్యవధిని కూడా పేర్కొనాలి.ఒకవేళ తిరిగి చెల్లించకపోతే, వేలం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లించే వివరాలను కూడా డాక్యుమెంట్‌లో పేర్కొనాలి.ఈ కొత్త మార్గదర్శకాలు బంగారు రుణాల రంగంలో మరింత నియంత్రణ, స్పష్టతను తీసుకురానున్నాయి. ఇది ఒకవైపు రుణదాతలకు ప్రమాదాలను తగ్గిస్తే, మరోవైపు రుణగ్రహీతలకు మోసాల బారిన పడకుండా, తమ బంగారు ఆస్తులకు మరింత భద్రతను కల్పిస్తుంది. పారదర్శకత పెరిగితే, గోల్డ్ లోన్స్ తీసుకోవడం మరింత సురక్షితంగా మారుతుంది.