సెంచరీ మిస్ చేసుకున్న బట్లర్.. వెస్టిండీస్‌పై విధ్వంసం!

Wait 5 sec.

ఇంగ్లండ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే బట్లర్ వీరోచితంగా ఆడాడు. బట్లర్ ఇన్నింగ్స్ ఆ జట్టు విజయంలో కీలకంగా మారింది. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచిన బట్లర్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ బెన్ డకెట్ కేవలం ఒక్క పరుగుకే వికెట్ కోల్పోవడంతో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన బట్లర్, జెమీ స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జెమీ స్మిత్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. స్మితి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా వెంటనే పెవిలియన్‌ బాట పట్టాడు. కేవలం 6 పరుగులు చేసిన బ్రూక్ రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విల్ జాక్స్ కూడా 9 పరుగులే చేయగా.. ఆఖర్లో జాకబ్ బేతెల్ 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జోస్ వన్ మ్యాన్ షోఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా నిలకడగా ఆడకపోయినా.. జోస్ బట్లర్ మాత్రం వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. రెండో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన బట్లర్ 19వ ఓవర్ వరకూ క్రీజులోనే కొనసాగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 59 బంతులు ఆడిన బట్లర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. మరో నాలుగు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుంది అనగా అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు. విండిస్ విఫలంఇంగ్లండ్ అందించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. విండీస్ జట్టులో ఓపెనర్ ఎవిన్ లూయీస్ ఒక్కడే 39 పరుగులతో రాణించగా.. ఆ తర్వాత ఛేజ్ 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే వెంటవెంటనే అవుటవ్వడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఇంగ్లండ్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో నాలుగు వికెట్లు తీసిన లియామ్ డాసన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.