నెల్లూరు జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది.. చెత్త కుప్పంలో నోట్ల కట్టలు కనిపించాయి. కొన్ని రోజుల క్రితం ఒక రైతు పోగొట్టుకున్న డబ్బులు అనుకోకుండా చెత్తలో ఉన్నట్లు తేలింది. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రైతు రామకృష్ణ ఈ నెల 4న తన బంగారు నగలను బ్యాంకులో కుదవపెట్టి రూ. 86 వేలు లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బును తీసుకుని బైక్ ముందున్న కవర్‌లో పెట్టుకుని వెళ్తున్నాడు. ఊరికి వెళ్లే దారి మధ్యలో భోజనం కోసం ఆగాడు.. ఇది గమనించిన ఒక వ్యక్తి, అతన్ని వెంబడించాడు. రామకృష్ణ భోజనం చేస్తుండగా అతని వాహనంలోని డబ్బును దొంగిలించాడు. బాధిత రైతు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు చోరీకి సంబంధించి అనుమానితుడిగా ఓ యువకుడిని పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించి.. అతడు కాదని నిర్ధారించుకుని వదిలేశారు. పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు డబ్బులు తీసిన వ్యక్తి శ్రీనివాసపురం వీధిలోకి వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు..ఈ క్రమంలో ఈ నెల 6న శ్రీనివాసపురం వీధిలో చెత్త సేకరించే బండి వచ్చింది. రాయదుర్గం సురేష్ అనే వ్యక్తి చెత్త పోస్తుండగా కుప్పలో ఒక కవర్‌లో డబ్బులు కనిపించాయి. ఇక్కడ డబ్బులు ఉన్నాయేంటని షాకయ్యారు.వెంటనే ఆ డబ్బు, బ్యాంకు పాస్‌ పుస్తకం, పాన్‌కార్డును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. చెత్త కుప్పలో డబ్బులు కనిపించిన వెంటనే తీసుకొచ్చి నిజాయితీగా పోలీసులకు అప్పగించిన సురేష్‌ను అందరూ మెచ్చుకున్నారు. సురేష్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు రూ. వెయ్యి బహుమతిగా ఇచ్చారు. పాస్‌పుస్తకం, పాన్‌కార్డు ఆధారంగా ఆ డబ్బు చెన్నారెడ్డిపల్లికి చెందిన రైతు రామకృష్ణదని నిర్ధారించారు.. వెంటనే ఆయనకు సమాచారం అందించారు. పోయాయి అనుకున్న డబ్బులు తిరిగి దొరకడంతో ఆ రైతు కూడా ఆనందం వ్యక్తం చేశారు.. పోలీసులు అతడికి డబ్బులు అప్పగిస్తామని చెప్పారు. ప్రారంభమైంది.. ఆధునిక హంగులతో ఉంది. కనిపించింది.. పాము శివలింగాన్ని చుట్టేసింది. దిశగా అడుగులుపడుతున్నాయి.