ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్లు వీళ్లే.. ప్రస్తుత జట్టులోని ముగ్గురు!

Wait 5 sec.

ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో. జూన్ 20న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి సీనియర్ ప్లేయర్లు లేకుండా భారత్.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్మెంట్ పలికారు. ఇక చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే లాంటే సీనియర్లను పక్కన పెట్టిన భారత సెలక్షన్ కమిటీ కుర్రాళ్లకు అవకాశం ఇచ్చింది. అయితే 2018 నుంచి ఇప్పటివరకు భారత జట్టు.. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో సుమారు నాలుగు టెస్టు సిరీస్‌లు ఆడింది. అందులో అత్యధికంగా ఎవరు రన్స్ స్కోరు చేశారు? టాప్‌-7 బ్యాటర్లు ఎవరు? అందులో ఎవరెవరు ఇప్పుడు ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత జట్టులో ఉన్నారు? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2018 నుంచి ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో 19 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. అందులో 44.31 సగటుతో 842 రన్స్ సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.: 18 ఇన్నింగ్స్‌లలో 34.11 సగటుతో 614 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. చెతేశ్వర్ పుజారా: 18 ఇన్నింగ్స్‌లలో 36.50 సగటుతో 584 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిషభ్ పంత్‌: 15 ఇన్నింగ్స్‌లలో 34.06 సగటుతో 511 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 2 ఫిఫ్టీలు ఉన్నాయి.రవీంద్ర జడేజా: 11 ఇన్నింగ్స్‌లలో 38.60 సగటుతో 386 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రోహిత్ శర్మ: 8 ఇన్నింగ్స్‌లలో 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరలు ఉన్నాయి.అజింక్య రహానే: 17 ఇన్నింగ్స్‌లలో 21.52 సగటుతో 386 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.